Warangal:నిండా ముంచుతున్న మొక్కజొన్న

Corn-formars

Warangal:నిండా ముంచుతున్న మొక్కజొన్న:జన్యుమార్పిడి ఆహార పంటలు పర్యావరణానికి చాలా డేంజర్. ఎందుకంటే అది పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఊహించడం కష్టం. సంప్రదాయ మొక్కలకు సమస్య. కానీ మారుమూల ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కోసమంటూ రహస్యంగా ప్రయోగాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ పరిసరాల్లో మొక్కజొన్న సాగు జోరుగా సాగుతోంది. ఇప్పుడు దిగుబడి రాక సీడ్ ఆర్గనైజర్ చేతులెత్తేయడంతో మ్యాటర్ మొత్తం బయటపడింది. ఈ మొక్కజొన్న సాగు చుట్టూ ఎన్నో డౌట్లు అలాగే ఉన్నాయి.

నిండా ముంచుతున్న మొక్కజొన్న

వరంగల్, మార్చి 11
జన్యుమార్పిడి ఆహార పంటలు పర్యావరణానికి చాలా డేంజర్. ఎందుకంటే అది పర్యావరణంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఊహించడం కష్టం. సంప్రదాయ మొక్కలకు సమస్య. కానీ మారుమూల ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కోసమంటూ రహస్యంగా ప్రయోగాలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా వెంకటాపూర్ పరిసరాల్లో మొక్కజొన్న సాగు జోరుగా సాగుతోంది. ఇప్పుడు దిగుబడి రాక సీడ్ ఆర్గనైజర్ చేతులెత్తేయడంతో మ్యాటర్ మొత్తం బయటపడింది. ఈ మొక్కజొన్న సాగు చుట్టూ ఎన్నో డౌట్లు అలాగే ఉన్నాయి. జవాబులే రావాల్సి ఉంది.ఈ మొక్కజొన్న పొత్తుల్ని చూడండి.. ఇది సీడ్స్ ఉత్పత్తి కోసమంటూ ఏజెన్సీ ఏరియాల్లో పండిస్తున్న పంట. సీడ్స్ కోసం పత్తి అయినా మరొకటైనా రైతులతో ఒప్పందాలు చేసుకుని పండించడం ఒకెత్తు. కానీ ఇక్కడ మాత్రం ఇవేవీ లేవు. అంతా సీక్రెట్. సీడ్స్ తేవడం, స్థానిక రైతులకు పండించాలని చెప్పడం, పంట మొత్తం కొంటామని నమ్మించడం ఇదే జరుగుతోంది. ఇప్పుడు దిగుబడి రాక సీడ్ ఆర్గనైజర్ అడ్రస్ లేకుండా పోవడం రైతులు రోడ్డెక్కడంతో కార్న్ సీడ్స్ చుట్టూ డార్క్ సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.గద్వాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఏరియాల్లో అక్కడక్కడ కాటన్ సీడ్స్ కోసం పంట పండిస్తుంటారు. కానీ ములుగు జిల్లాలో మాత్రం మొక్కజొన్న సీడ్స్ కోసమంటూ ప్రయోగాలు చేస్తున్నారా.. లేకుంటే ఇది జన్యుమార్పిడి మొక్కజొన్న పంటా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే జన్యుమార్పిడి ఆహార పంటలు పండించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాలి. ఇష్టంవచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే జీన్ మోడిఫైడ్ సీడ్స్ తో బయో డైవర్శిటీకి ముప్పు ఉంటుంది. మనం తినే ఫుడ్స్ లో మారిపోయి అది ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అంచనా వేయడం కష్టం.

అందుకే వీటి అనుమతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.మెయిన్ క్వశ్చన్ ఏంటంటే.. ములుగు ఏరియాలో పండిస్తున్న మొక్కజొన్న క్రాప్ జెనెటికల్లీ మోడిఫైడా కాదా అన్నది ఒకటి.. సీడ్స్ కోసమే పండిస్తున్నారా అన్నది ఇంకొకకటి. ఒకవేళ సీడ్స్ కోసమే పండిస్తే అనుమతులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఎక్కడ? ఒకవేళ జన్యుమార్పిడి విత్తనాలను నేరుగా తీసుకొచ్చి సాగు చేయిస్తుంటే ఆ అనుమతులు ఏవి? అన్నది కీలకంగా మారాయి. ములుగు ఏరియాలో సాగవుతున్న మొక్క జొన్న క్రాప్ చుట్టూ సవాలక్ష డౌట్లు పెరుగుతున్నాయి. ఒక్కసారి ఈ విత్తన బ్యాగ్ చూడండి.. దీనిపై పేరు లేదు ఊరు లేదు. జస్ట్ ఒక కోడ్ మాత్రమే ఉంది. ఇది కూడా పెద్ద డౌట్. రైతులు చెబుతున్నదాని ప్రకారం ఈ సీడ్స్ అన్నీ విదేశాల నుంచే వస్తున్నాయంటున్నారు. అదే జరిగితే క్వారంటైన్ ఎటు వెళ్లింది.. చెకింగ్స్ ఏమి చేశారు.. ఇక్కడిదాకా ఎలా వచ్చాయి అన్నది కీలకంగా మారుతున్నాయి.అడ్రస్ లేకుండా వెళ్లిన సీడ్ ఆర్గనైజర్స్ ను పట్టుకుంటేనే అసలు నిజాలు తెలుస్తాయంటున్నారు. నిజానికి బీటీ కాటన్ చాలా మందికి తెలుసు. గతంలో పత్తి దిగుబడులు రాక చీడపీడల కారణంగా రైతులు చాలా నష్టపోయే వారు. కానీ బీటీ ఎప్పుడైతే ఎంటర్అయిందో పత్తి దిగుబడులు పెరిగాయి. చీడపీడల బాధలు తప్పాయి. బీటీ అంటే బాసిల్లస్ థురెంజియెన్సిస్. ఇందులో క్రై2 ఏసీ అనే జన్యువు కీలకంగా ఉంటుంది. ఇది పత్తిని ఆశించే పురుగు పత్తి ఆకును తినగానే చనిపోయేలా చేస్తుంది. విషపూరితం అన్న ఇది వాణిజ్య పంట అయిన పత్తికి వర్కవుట్ అయింది. అదే ఆహార పంటల్లో ఇలా జన్యుమార్పిడి చేస్తే అది తినే జనాలు, పశు పక్ష్యాదులపై ఎలాంటి డేంజర్ ఎఫెక్ట్ చూపుతుందన్నది క్వశ్చన్ మార్క్. అందుకే వీటి అనుమతులు అంత సులువుగా రావుకానీ మొక్కజొన్నపై చాలానే కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే.

గతేడాది తమిళనాడులో కూడా ఈ జన్యుమార్పిడి మొక్కజొన్న క్రాప్ చుట్టూ పెద్ద రగడే నడిచింది. 2021 మార్చిలో మొక్కజొన్న సహా 24 ఆహార పంటలను దిగుమతి చేసుకోవడానికి జీఎం – ఫ్రీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఒక పంట జన్యుమార్పిడా కాదా అన్నది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో తెలుస్తుంది. ఇటీవలే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సైంటిస్టులు సమర్పించిన జర్నల్ లో భారత్ లో మొక్కజొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ లో జన్యుమార్పిడి చేసిన ఆనవాళ్లను గుర్తించారు. జీఎం పాజిటివ్ వచ్చింది. ఇది ఆందోళనపరిచే విషయం. ఇదే సీన్ ములుగు జిల్లా ఏజెన్సీలో రిపీట్ అయిందా అన్నది శాంపిల్స్ టెస్ట్ చేస్తేనే బయటకు వస్తుందంటున్నారు. ములుగు జిల్లాలో బీటీ మొక్కజొన్న సాగు చేస్తున్నామన్న విషయం అక్కడి గిరిజన రైతులకు కూడా తెలియదు. కొన్ని విత్తన కంపెనీల పేర్లతో కొంతమంది ఆర్గనైజర్లు, ఏజెంట్లు వేసిన ఉచ్చులో పడ్డారు అక్కడి అమాయక రైతులు. మొక్కజొన్న విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 4 టన్నుల పంట దిగుబడి వస్తుందని.. భారీగా ఆదాయం వస్తుందని ఆశ చూపించడంతో.. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో విత్తనాల కోసమే మొక్కజొన్న సాగు చేశారు అక్కడి రైతులు. కానీ పంట కోసే సమయానికి చూస్తే.. కనీసం ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు.. ఇక్కడ బీటీ సాగు చేస్తున్నారేమో అన్న అనుమానాలను బలపరచడానికి మరికొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.

విత్తన కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు, ఏజెంట్లు.. రైతులతో మాట్లాడి ఇదిగో ఈ విత్తనాలను నాటించారు. కానీ అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదు. రాతపూర్వకంగా ఏ కంపెనీ విత్తనాలను ఇస్తున్నారు.. ఎలా సాగు చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎంతకు పంటను కొంటారన్నది లేదు. పైగా రైతులకు విత్తనాలను సరఫరా చేసిన ప్యాకెట్లపై ఏ కంపెనీ పేరు గానీ, సింబల్‌ గానీ లేదు. కేవలం కొన్ని కోడ్‌ నెంబర్లు వేసిన తెల్ల సంచుల్లో విత్తనాలను ప్యాక్ చేసి ఇచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి సాగు మొదలుపెట్టేశారు. కంపెనీ పేర్లను చెప్పి.. పొలాల్లో బోర్డులు కూడా పెట్టలేదు. గిరిజన ప్రాంతాల్లో అదీ చదువు అసలే రాని రైతుల పొలాల్లోనే ఎందుకు వీటిని సాగు చేస్తున్నారు? దిగుబడి రాలేదని తెలిశాక.. విత్తనాలు సరఫరా చేసిన ఏజెంట్లు, ఆర్గనైజర్లు ఎందుకు పరారయ్యారు?ఈసారి మొక్కజొన్న పొత్తుకు గింజలు రాకపోవడంతో ఏజెంట్లు పంట కొనలేదు. నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతుల ఆందోళన చేయడంతో మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. సంప్రదాయ విత్తనాల తయారీ రైతుల చేతి నుంచి ఎప్పుడో బడా కంపెనీల చేతిలోకి వెళ్లిపోయింది. గతంలో రైతులు విత్తును దాచుకునే వారు.

కానీ ఇప్పుడు కంపెనీలు అమ్మినవే కొనే పరిస్థితి వచ్చింది. అయితే చాలా కంపెనీలు డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండా దొంగచాటుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేసేలా ఏ ప్రయోగం చేసినా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని బయోలాజికల్ డైవర్సిటీ చట్టం 2002 చెబుతోంది.ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సీడ్ ఆర్గనైజర్ ఎవరు.. ఏ కంపెనీ కోసం పని చేస్తున్నారన్నది తేలాలంటున్నారు. ఇల్లీగల్ జీఎం అయితే పర్యావరణానికి ప్రమాదమని గుర్తు చేస్తున్నారు. ఇది విత్తన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా విత్తనాల కోసమే పంటలు సాగు చేయిస్తుంటే రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు రైతులకు పక్కాగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్ లేకుండా, కాంట్రాక్ట్ లేకుండా ఆర్గనైజర్స్ రంగంలోకి దిగుతుంటారు. అటు విత్తన కంపెనీలు కూడా డైరెక్ట్ గా రైతులతో డీల్ చేయవు. మధ్యవర్తులను రంగంలోకి దింపుతాయి. బయోడైవర్సిటీ చట్టం ప్రకారం ఉల్లంఘనలు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా ఉంటుంది. ఇది ఎంత లెక్క. అందులోనూ దీన్ని నిరూపించి చట్టం ముందు పెట్టే పరిస్థితి ఉందా?

Read more:Karimnagar:అన్నీ తానై..అంతా తానై..

Related posts

Leave a Comment