Vijayawada:డీజీపీ రేసులో హరీష్ గుప్తా

Harish Gupta in DGP race

ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

డీజీపీ రేసులో హరీష్ గుప్తా

విజయవాడ, జనవరి 18
ఏపీలో కొత్త డీజీపీ ఎంపికపై మళ్లీ చర్చ మొదలైంది. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్సీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యం కానుంది.మరోవైపు కొత్త డీజీపీ రేసులో మాజీ డీజీపీ హరీష్‌ కుమార్ గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌ కుమార్‌ గుప్తాను గత మేలో డీజీపీగా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాట్లలో పోలీసులు విఫలం కావడం, గత ఏడాది జూన్‌ 12న నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్ కావడం వివాదాస్పదమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విఐపిలు కూడా సకాలంలో చేరుకోలేకపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 21వ తేదీన డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందిద్వారకా తిరుమల రావు పదవీ కాలం జనవరి 31తో ముగియనుండటంతో ఆయన్ని మరికొంత కాలం పొడిగిస్తారా లేదా అనే దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత కొత్త డీజీపీ ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు.

ద్వారకా తిరుమల రావు తర్వాత సీనియార్టీలో మొదటి స్థానంలో ఉన్నఅంజనీ కుమార్ ఏపీ క్యాడర్‌కు రాలేదు. ఆయన తర్వాత ఉన్న హరీష్‌ కుమార్‌ గుప్తా 2025 ఆగస్టులో పదవీ విరమణ చేస్తారు. ద్వారకా తిరుమలరావు పదవీ కాలాన్ని పొడిగిస్తే హరీష్‌కుమార్‌కు డీజీపీ అవకాశం దక్కదు. దీంతో ప్రభుత్వం సీనియార్టీ ప్రాతిపదికన హరీష్ కుమార్‌కు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.గత ఏడాది మే6వ తేదీన హరీశ్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా ఎంపిక చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించాలని ఈ మేరకు సీఎస్ కు జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. మే 5న ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో హరీష్‌ను ఎంపిక చేసింది. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను ఏపీ సీఎస్ ఈసీకి సూచించారు. వీరిలో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు.సీనియార్టీలో హరీష్‌ తర్వాత స్థానాల్లో సీతారామాంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత 93 బ్యాచ్‌కు చెందిన నళినీ ప్రభాత్‌, మహేష్ దీక్షిత్‌లు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అమిత్ గార్గ్ సర్దార్ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు. 94 బ్యాచ్‌లో పీవీ సునీల్‌, కుమార్ విశ్వజిత్, రవిశంకర్ అయ్యన్నార్, బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. హరీష్‌ కుమార్ తర్వాత డీజీపీ రేసులో బాలసుబ్రహ్మణ్యం, రవిశంకర్ అయ్యన్నార్, కుమార్‌ విశ్వజిత్‌ ‌లు ఉంటారు.

Read:Guntur:కృష్ణా ముంపునకు శాశ్వత పరిష్కారం

Related posts

Leave a Comment