TS Electricity | ప్రజలకు భారం కానున్న కరెంట్ | Eeroju news

TS Electricity

ప్రజలకు భారం కానున్న కరెంట్

హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్)

TS Electricity

Telangana: విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డులు: ఎన్ని మెగావాట్లంటే? - Telugu Oneindiaతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అమలు చేస్తోంది. రుణ మాఫీ చేసింది. దసరాకు రైతుభరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి ప్రజలకు షాక్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్‌ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయా అంటే అవుననే అంటున్నాయి విద్యుత్‌ పంపిణీ సంస్థలు. తమకు ఇప్పటికే భారీగా లోటు ఉందని, ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలో 1,200 కోట్లు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. గృహ విద్యుత్‌ 300 యూనిట్లు దాటితే స్థిర చార్జీ కిలోవాట్‌కు రూ.40 పెంచాలని కోరాయి. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. మొత్త మూడు కేటగిరీల్లో విద్యుత్‌ చార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి.తెలంగాణలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యవయాల మధ్య ఉన్న లోటును వెల్లడించాయి. రెండు డిస్కంలకు కలిసి రూ.14,222 కోట్ల లోటు ఉందని అంచనా వేశాయి.Telangana: తెలంగాణలో భారీగా పెరగనున్న కరెంట్ చార్జీలు..? మరో షాక్ తప్పదా? – News18 తెలుగు

ఈ మొత్తం లోటులో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో సమకూర్చాలని కోరాయి. అవి పోగా మిగిలిన రూ.1,200 కోట్లుచార్జీల పెంపుద్వారా పూడ్చుకోవాలని ప్రతిపాదించాయి. అయితే భారం పేద, మధ్య తరగి గృహ వినియోగదారులపై పడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గృహ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే.. కిలోవాట్‌కు స్థిర చార్జీ రూ.10 వసూలు చేస్తున్నారు. అయితే ఆ మొత్తాన్ని మరో రూ.40 పెంచి రూ.50 వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్‌ను అర్హులకు ఉచితంగా ఇస్తోంది. ఇక 299 యూనిట్ల విద్యుత్‌ వాడే మధ్య తరగతి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 300 యూనిట్లు దాటినవారిపైనే భారం వేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 300 యూనిట్లకుపైగా విద్యుత్‌ వినియోగించే గృహ వినియోగదారులు కేవలం 20 శాతమే. వారిపై మాత్రమే భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా 80 శాతం వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని డిస్కంలు చెబుతున్నాయి.

డిస్కంల ప్రతిపాదనపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల బహిరంగ చర్చ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్త ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.

TS Electricity

 

Revanth Reddy | రెండు గుడ్ న్యూస్ లు చెప్పిన రేవంత్ | Eeroju news

Related posts

Leave a Comment