Tirupati Laddu | తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా | Eeroju news

Tirupati Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా

తిరుమల, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

Tirupati Laddu

తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం అన్ని మీడియా సంస్థల్లో చర్చ నడుస్తోంది. కొంతమంది చంద్రబాబు వ్యాఖ్యలపై ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు వైసీపీ హయాంలో జరిగింది వాస్తవమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తరుణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 50 ఏళ్తుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్లు ఉండి తొలగించాడో ఇప్పుడు అర్ధమైందా ? అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్లుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయడం వెనుక జగన్ రెడ్డి చేసింది కుట్ర కాక మరేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.మరోవైపు, తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు ఎలా మాట్లాడుతారని ఆరోపించారు.

ఏకంగా వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా ఉపయోగిస్తే.. తక్షణం విచారణ కమిటీ వేయాలని చెప్పారు. దీంతోపాటు సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమలను అపవిత్రం చేసిన నీచులెవరో నిగ్గుతేల్చాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.అలాగే, లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని సవాల్ విసిరారు. అంతకుముందు, తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు మంగళగిరిలో కూటమి ప్రభుత్వ శాసనసభాపక్ష సమావేశంలో ఆరోపణలు చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారు. అలాగే జగన్ హయాంలో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేయడంతోపాటు తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు.ముఖ్యంగా భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యతలేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు రాష్ట్ర మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు వాడారాన్న సంచలన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఊరకనే ఆరోపణలు చేయరు. బలమైన ఆధారాలు ఉండబట్టే చేసి ఉంటారని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీ ఈవో సీనియర్ ఐఏఎస్ శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. అప్పటి వరకూ కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. ఆయనకు అర్హతలు లేకపోయినా ఆ పోస్టు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి పెట్టారు. వెంటనే.. లడ్డూ ప్రసాదానికి వాడుతున్న పదార్థాలను తనిఖీ చేయించారు. నెయ్యిని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ లో టెస్టు చేయించారు. ఫలితాలు ఏమిటో బయట పెట్టలేదు కానీ.. వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టేశారు. బహుశా.. ఆ నివేదికలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు వెలుగులోకి వచ్చి ఉంటుందని.. దాన్ని సీఎంకు తెలియచేసి ఉంటారని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత క్వాలిటీతో ఉన్న పదార్థాలతోనే సరఫరా చేస్తారు.

గత ఇరవై ఏళ్లకుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ కు చెల్లిస్తున్న ధర కంటే తక్కువ ధరను నిర్ణయిస్తూ టెండర్లు పిలిచారు. ఆ ధర ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నష్టాలు వస్తాయని నందిని టెండర్లలో పాల్గొనలేదు. ఈ కాంట్రాక్టులను.. యూపీకి చెందిన రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు నెయ్యి ఎలా తయారు చేస్తాయన్నది పట్టించుకోలేదు. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, క్వాలిటి లిమిటెడ్ వంటి కంపెనీలకు ఇచ్చారు. నిజానికి ఇలాంటి నెయ్యి పేరు మోసిన డెయిరీలే సిద్దం చేయగలవు. వీరు ఇచ్చే నెయ్యి క్వాలిటీని స్వతంత్ర సంస్థలతో కాకుండా తామే పరీక్షిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

నిజానికి శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి అవసరమైన అత్యంత నాణ్యమైన నెయ్యి.. ఆ యూపీ కంపెనీలు సరఫరా చేసినంత తక్కువ ధరకు రావు. కేవలం నందిని బ్రాండ్ నెయ్యి టెండర్లలో పాల్గొనకుండా చేయడానికే ఆ ధరను నిర్ణయించి ఉద్దేశపూర్వకంగా ఆ కంపెనీని తప్పించారని.. తమకు ఇష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా చేశారని అప్పట్లోనే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. కానీ టీటీడీలో ప్రతిదీ తాము టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పి టీటీడీ ఆ నెయ్యినే కొనుగోలు చేసింది.

వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డినే కీలకంగా వ్యవహరించారు. జేఈవోగా ఉన్నా.. ఈవోగా ఉన్నా ఆయనదే పెత్తనం. నిజానికి ఐఏఎస్ అధికారులకే ఆ బాధ్యతలు ఇవ్వాలి. కానీ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ధర్మారెడ్డినే టీటీడీలో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి , ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లగా వ్యవహరించారు. జంతువుల కొవ్వును వాడారాని.. ఆ నెయ్యి విషయంలో వచ్చిన ల్యాబ్ రిపోర్టు బయటకు వస్తే.. హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లుగా వైసీపీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tirupati Laddu

 

Mukkanti Prasadas to Tirupati Collector | తిరుపతి కలెక్టర్ కు ముక్కంటి ప్రసాదాలు | Eeroju news

Related posts

Leave a Comment