సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా… నిన్న రోజా… ఇవాళ తమ్మినేని తిరుపతి, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) RK Roja వైసిపి ఆత్మ రక్షణలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసిపి హయాంలో వైఫల్యాలు బయటకు వస్తున్నాయి.అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల సంఖ్య పెరుగుతోంది. ఒక విధంగా ఇది సంక్లిష్ట పరిస్థితి. అందుకే వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. వైసిపి నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారు. తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ వల్లభనేని వంశీ ఒక్క మాట అనకుండా సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని సైతం గతానికి భిన్నంగా మాట్లాడారు. ఎక్కడా మాటల్లో మునుపటి దూకుడు తనం ప్రదర్శించలేదు. బూతులు మాట్లాడలేదు. టీటీడీ…
Read MoreTag: YCP
Jagan Chalo Bangalore | ఛలో బెంగుళూరు.. | Eeroju news
ఛలో బెంగుళూరు.. కేడర్ లో బయిటపడుతున్న అసహనం అనంతపురం, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jagan Chalo Bangalore వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ బెంగళూరుకు వెళుతూ పార్టీ నేతలకు అసహనం రేపుతున్నారు. జగన్ ఎప్పుడు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడ క్యాడర్ నుంచి లీడర్ల వరకూ ఎలా ధైర్యంగా ఉంటారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పది సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఎవరైనా చనిపోయినా, లేకపోయినా వరదల వంటి ఆకస్మిక ఘటనలు జరిగితే విజయవాడకు వస్తున్నారు తప్పించి ఇక్కడే ఉండి రాజకీయం చేయడానికి జగన్కు మనసొప్పడం లేదంటున్నారు. ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే గడుపుతుండటం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు సొంత పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.వైఎస్…
Read MoreByreddy | పాపం… బైరెడ్డి | Eeroju news
పాపం… బైరెడ్డి కర్నూలు, సెప్టెంబర్ 4, (న్యూస్ పల్స్) Byreddy వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హత్య కేసులో ఆయనకు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటి బయటకు వచ్చింది. అదే కేసులో సిద్ధార్థ రెడ్డి అనుమానితుడు కూడా. అయితే ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన వాయిస్ కాల్స్ కు సంబంధించిన సంభాషణలు హత్యకు గురైన వ్యక్తి కుమార్తెకు దొరకడం విశేషం. ఇప్పటికే ఈ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎలాగైనా శిక్ష పడాలని మృతుడి కుమార్తె భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమెకు కీలక సాక్షాలు చిక్కడం విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్…
Read MoreThree MPs | ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు… | Eeroju news
ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చేశారు… విజయవాడ, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Three MPs వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో వారి బలం 9కి పడిపోయిదంది. ఈ తొమ్మిది మందిలోనూ ఆరేడుగురు పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముగ్గురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని ప్రకటించారు. వారు ముగ్గురు ఎవరంటే విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ . కృష్ణయ్య. వైసీపీకి రాజీనామా చేయబోయే ఎంపీల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామెవరం వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తమకు జగన్ ఎలాంటి…
Read MoreYCP | వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా | Eeroju news
వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా అమరావతి YCP వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసారు. – పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేసారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ ఎంపికయ్యారు. YCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
Read MoreIs YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news
బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Read MoreYCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
ఏలూరు వైసీపీ ఖాళీ ఏలూరు, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) YCP వైసీపీకి మరో బిగ్ షాక్ తగలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ కూటమి.. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి కార్పొరేటర్లు జంప్ అయ్యారు. అలాగే హిందూపురం, మాచర్లతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు.అందులో భాగంగానే ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ టీడీపీకి తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ దంపతులతోపాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, కార్పొరేటర్ల…
Read MorePurification from Kadapa district | కడప జిల్లా నుంచే ప్రక్షాళన… | Eeroju news
కడప జిల్లా నుంచే ప్రక్షాళన… కడప, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Purification from Kadapa district ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ కోటకు బీటలు బారాయి.. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలలో మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఇంతవరకు ఇలాంటి పరాభవాన్ని ఎప్పుడూ చెవిచూడలేదు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా, వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ పెట్టిన వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే రెండు దఫాలుగా తమ సత్తాను చాటి, కడప జిల్లాలో తమకు ఎదురు లేదు అంటూ నిలిచిన వైసీపీ నేతలు ఈసారి చతికిలాపడక తప్పలేదు. ఎన్డీయే కూటమి హవాకు వైసీపీ తోక ముడిచింది. కేవలం మూడు అంటే…
Read MoreChanging local calculations | మారిపోతున్న స్థానిక లెక్కలు | Eeroju news
మారిపోతున్న స్థానిక లెక్కలు విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Changing local calculations విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లగా ఉన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 64 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వీరిలో 11వ డివిజన్ కార్పొరేటర్ రాజీనామాకు ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం 63 మంది కార్పొరేటర్లు మిగిలారు. పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరటంతో… రాబోయే రోజుల్లో మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే… బెజడవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే…
Read MoreExcise again in place of Seb | సెబ్ స్థానంలో మళ్లీ ఎక్సైజ్ | Eeroju news
సెబ్ స్థానంలో మళ్లీ ఎక్సైజ్ గుంటూరు, ఆగస్టు 21 (న్యూస్ పల్స్) Excise again in place of Seb ఏపీలో ఐదేళ్ల క్రితం సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకాలని నిర్ణయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీస్ శాఖల నుంచి సిబ్బందిని కలిపి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. మొదట్లో మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాటు సారా తయారీ నిరోధం, గంజాయి సాగు, రవాణాలను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన సెబ్ను తర్వాత ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాలకు కూడా విస్తరించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించింది. మద్యం విక్రయాలను కట్టడి చేసే…
Read More