Another fire test for YCP | వైసీపీకి మరో అగ్ని పరీక్ష | Eeroju news

Another fire test for YCP

వైసీపీకి మరో అగ్ని పరీక్ష విశాఖపట్టణం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Another fire test for YCP   అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. అదే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక. జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద అనర్హతా వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి.…

Read More

YCP is empty in the kuppam | కుప్పంలో వైసీపీ ఖాళీ | Eeroju news

YCP is empty in the kuppam

కుప్పంలో వైసీపీ ఖాళీ తిరుపతి,  ఆగస్టు 1  (న్యూస్ పల్స్) YCP is empty in the kuppam ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇంచార్జులు పత్తా లేకండా పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఐదేళ్ల పాటు హవా చెలాయించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  భరత్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడితో  పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం…

Read More

YCP leaders who believed in silence | మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు | Eeroju news

YCP leaders who believed in silence

మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు విజయవాడ, జూలై  30, (న్యూస్ పల్స్) YCP leaders who believed in silence వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం యాభై మంది వరకూ ఉంటారు. పార్టీ ఓడిపోక ముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్ కూ కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలా మంది స్పందించడం లేదు. కొంత మంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవడం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకుని చాలా మంది అనుకుంటున్నారు. వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సీనియర్…

Read More

Threat to YCP from Sharmila | షర్మిల నుంచి వైసీపీకి ముప్పు | Eeroju news

YS Sharmila

షర్మిల నుంచి వైసీపీకి ముప్పు విజయవాడ, జూలై  26 (న్యూస్ పల్స్) Threat to YCP from Sharmila   వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో  భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అడగకుండానే మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ఉన్నందున ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఎందుకన్న  ఆలోచన చేయలేదు. అంశాల వారీగా తమ మద్దతు  బీజేపీకి ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే హఠాత్తుగా బుధవారం సీన్ మారిపోయింది. జగన్ కోసం ఇండీ కూటమి నేతలంతా తరలి వచ్చారు. మద్దతు పలికారు. అందరూ ఇండియా కూటమిలోకి రావాలని జగన్ కు ఆహ్వానం పలికారు. ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజున జగన్ కాలు నొప్పికి…

Read More

Ummareddy Venkateshwarlu | వైసీపీలో మండలి చిచ్చు | Eeroju news

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైసీపీలో మండలి చిచ్చు విజయవాడ, జూలై 25 (న్యూస్ పల్స్) Ummareddy Venkateshwarlu వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఢిల్లీ వేదికగా గళం ఎత్తారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన దీక్షకు సమాజ్ వాది పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే శివసేన పార్టీ మద్దతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. శివసేన తరుపున ఎంపీ హాజరయ్యారు. ఏపీలో నరమేధం కొనసాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకవైపు జాతీయ స్థాయిలో జగన్ ఇతరుల మద్దతు పొందుతుండగా.. ఏపీలో వైసీపీ నుంచి నేతల నిష్క్రమణ ప్రారంభమైంది. అది కూడా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి. నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసిపికి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపి…

Read More

Big planning behind Jagan’s dharna | జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్ | Eeroju news

Big planning behind Jagan's dharna

జగన్ ధర్నా వెనుక బిగ్ ప్లానింగ్ గుంటూరు, జూలై 23, (న్యూస్ పల్స్) Big planning behind Jagan’s dharna వై నాట్ 175 అంటూ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కన్న జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కు అర్హులైన ఎమ్మెల్యేలను సైతం గెలిపించుకోలేకపోయారు. ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో వైఎస్ఆర్ సీపీని మళ్లీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జగన్ భావిస్తున్నారు. ముందు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలోనైనా టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే..ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిలో పడాలి. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలి. అంతకన్నా ముఖ్యంగా నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలి. అందుకే ఆ దిశగా జగన్ ముందుకు…

Read More

Jagan is on the path of KCR | కేసీఆర్ బాటలోనే జగన్…. | Eeroju news

Jagan is on the path of KCR

కేసీఆర్ బాటలోనే జగన్…. హైదరాబాద్, జూలై 22, (న్యూస్ పల్స్) Jagan is on the path of KCR పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. తమకు తాముగా పెంచుకునేది.తమకు తాముగా పాటించేది. అదే ప్రజా మన్ననలను అందుకోగలుగుతుంది. తెలంగాణలో పెద్దరికాన్ని ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెద్దరికాన్ని తెలంగాణ ప్రజలు కూడా గౌరవించారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిపెట్టారు. కానీ ఆయన పెద్దరికం మితిమీరింది. ప్రత్యర్థులను చులకన చేసింది. అదే వారిలో ఐక్యతకు కారణమైంది. తెలంగాణ సమాజం కెసిఆర్ ను పట్టించుకోకుండా చేసింది. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తేనే అది నిలబడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. రాజకీయాల్లో ఉన్నవారు మాటను పొదుపుగా వాడాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాలి. ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అనేది…

Read More

Jagan is alone in Delhi | ఢిల్లీలో జగన్ ఒంటరి | Eeroju news

Jagan is alone in Delhi

ఢిల్లీలో జగన్ ఒంటరి విజయవాడ, జూలై 22 (న్యూస్ పల్స్) Jagan is alone in Delhi ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగిపోతున్నాయని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో సమావేశం అయిన ఆయన కలసి వచ్చే పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి ఢిల్లీలో మద్దతుగా వచ్చే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోనహన్ రెడ్డి ఇంత కాలం అనుసరిస్తున్న వ్యూహమే అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో నేరుగా ఒక్క సారి కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఓ సారి వైసీపీ నేరుగా  బీజేపీకి…

Read More

Sympathy that Vijayasai Reddy could not find | విజయసాయిరెడ్డికి దొరకని సానుభూతి | Eeroju news

Sympathy that Vijayasai Reddy could not find

విజయసాయిరెడ్డికి దొరకని సానుభూతి విశాఖపట్టణం, జూలై 18, (న్యూస్ పల్స్) Sympathy that Vijayasai Reddy could not find ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికీ తేరుకోలేదు. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు అంతర్గత రాజకీయాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి పరోక్షంగా బయట పెట్టారు. వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తాజాగా ఓ మహిళకు పుట్టిన బిడ్డ విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం సృష్టించినది సొంత పార్టీ నేతలేనని ఆయన అంటున్నారు. అయితే ఆ విషయాలను  విస్తృతంగా ప్రచారం చేసిన మీడియాపై ఆయన అసభ్యకరంగా తిట్లందుకున్నారు. అది కూడా వివాదాస్పదమయింది. ఇంత జరుగుతున్నా ఆయనకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. వైఎస్ఆర్‌సీపీ ఆస్థాన మీడియాలోనూ ఆయనకు మద్దతు లేదు. ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు…

Read More

YCP | ఇంకా కోలుకోని వైసీపీ… | Eeroju news

YCP

ఇంకా  కోలుకోని వైసీపీ… తిరుపతి, జూలై  17 (న్యూస్ పల్స్) YCP త్తూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 2014 ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. 2019లో తన బలాన్ని ఏకంగా 13 స్థానాలకు పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఒక స్థానం నుంచి ఏకంగా 12 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినా.. స్థానిక పరిస్థితులు, సామాజిక లెక్కలతో వైసీపీయే ఆధిపత్యం చలాయించేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఎదురుగాలికి.. చంద్రబాబు హవా కూడా తోడు కావడంతో వైసీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారక నాథరెడ్డి మాత్రమే విజయం సాధించారు.…

Read More