KTR | కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం | Eeroju news

కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం

కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్‌ చేస్తారని ప్రచారం హైద్రాబాద్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) KTR ఫార్మా కంపెనీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్‌ కలెక్టర్‌‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు తెలంగాణలో రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. సీఎం సొంత నియోజక వర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పట్నం రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్‌ పేరును ప్రస్తావించడంతో ఆయన్ని కూడా అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నంను ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో…

Read More

KCR | జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్ | Eeroju news

జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్

జనవరి నుంచి జనాల్లోకి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 12, (న్యూస్ పల్స్) KCR భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మరోసారి ఫీల్డ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంముగిసిన తర్వాత ఆయన పార్టీ నేతల్ని కలవడం మానేశారు. పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా వస్తే అశీర్వదించడం తప్ప రాజకీయాలు మాట్లాడి చాలా కాలం అయింది. అయితే హఠాత్తుగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమయం ఇచ్చారు. రాజకీయ అంశాలు మాట్లాడారు. దాంతో కేసీఆర్ .. మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.భూపాలపల్లిజిల్లాలో ఇటీవల ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని త్వరలో వారింటికి వెళ్లి పరామర్శించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా పార్టీ నేతలకు…

Read More

Real Estate | హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు… | Eeroju news

హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు...

హైదరాబాద్ లో రియల్ ఆఫర్లు… హైదరాబాద్, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Real Estate హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఒకరకంగా ఇబ్బందులు పడుతుంది. కొనేవారు లేక అనేక ఫ్లాట్లు మిగిలిపోతున్నాయి. దీంతో బిల్డర్లు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గింది. దీనికి అనేక కారణాలున్నాయి. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగిరం జరుగుతుండటంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కొంత రియల్ ఎస్టేట్ ఏపీ వైపు మళ్లిందని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంత రియల్ రంగం ఊపందుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో కొంత పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గింది.ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ వైపు…

Read More

KCR & Revanth Reddy | రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. | Eeroju news

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్..

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. హైదరాబాద్, నవంబర్ 11, (న్యూస్ పల్స్) KCR & Revanth Reddy కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు.చాలా కాలం తరువాత కేసీఆర్ ఫొటో పేపర్లలో కనిపించింది. కేసీఆర్ మాటలు మీడియాలో వినిపించాయి. కేసీఆర్ వ్యాఖ్యలు పేపర్లలో ప్రచురితమయ్యాయి. కొన్ని నెలల తరువాత కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో సంతోషం కనిపించింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే.. ఒకప్పుడు సింహంలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కేసీఆర్‌ను నిన్న చాటుమాటుగా వీడియో తీస్తూ పోస్ట్ చేశారు. అయితే.. ఎవరో…

Read More

Telangana | 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. | Eeroju news

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌..

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Telangana ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజు తేదీలను తెలంగాణ ప్రాథ‌మిక విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ఈ నెల 18 వ‌ర‌కు ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 18వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు, రూ.200 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. అంతే కాకుండా రూ.500 రుసుముతో డిసెంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. 21వ తేదీనే చివ‌రి తేదీగా ప్ర‌క‌టించింది. ఆ త‌ర‌వాత ఫీజు క‌ట్టేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫీజుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే… రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు అన్ని స‌బ్జెక్టుల‌కు క‌లిపి రూ. 125 చెల్లించాల్సి…

Read More

Malla Reddy | మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు | Eeroju news

మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు

మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Malla Reddy పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు.…

Read More

BC Commission Chairman | ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! | Eeroju news

ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..!

ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..! బీసీ కమిషన్‌ చైర్మన్‌ హైదరాబాద్‌ BC Commission Chairman ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్‌ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్‌ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పా రు. సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు. CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news

Read More

KTR and MLA Kaushik Reddy | ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ | Eeroju news

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హైదరాబాద్ KTR and MLA Kaushik Reddy హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్య క్తం చేసారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే?  ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు…

Read More

Revanth Reddy | 54 అవతారాల్లో రేవంత్ | Eeroju news

54 అవతారాల్లో రేవంత్

54 అవతారాల్లో రేవంత్ ఖమ్మం, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Revanth Reddy ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఒక యువతి సొంతం చేసుకుంది. ఒకే వ్యక్తి చిత్రాన్ని వేరు వేరు గెటప్‌లలో ఉన్నట్లు తెల్లని కాగితం పై పెన్సిల్ ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ తో అద్భుతమైన చిత్రలేఖనం , కళాఖండాలు సృష్టిస్తూ.. వేలాది మందిని అబ్బుర పరుస్తుంది నిర్మల సాయిశ్రీ అనే యువతి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సంబంధించి 54 అవతారాల్లో అద్భుత కళాఖండాన్ని సృష్టించింది.తన తండ్రి ఒక ఫైన్ ఆర్ట్స్ కళాకారుడు. తండ్రి నుంచి అభిరుచి గా తీసుకున్న నిర్మల సాయిశ్రీ తాను కూడా చిత్రలేఖనం గీయడం ప్రారంభించింది. అల అలా.. తాను కూడా అద్భుతమైన పెన్సిల్ ఆర్టిస్ట్ గా ప్రావీణ్యం సాధించి ఎందరో…

Read More

Bandi Sanjay Kumar | కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి | Eeroju news

కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి

కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ Bandi Sanjay Kumar రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు. చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలని అన్నారు. కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్, నేను కొట్లాడాము.  అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. సమస్యను నేను డైవర్ట్ చేయడం లేదు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్ కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు లో కాంగ్రెస్ – బీఆర్ఎస్  కాంప్రమైజ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్,…

Read More