ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హైదరాబాద్ KTR and MLA Kaushik Reddy హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్య క్తం చేసారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు…
Read MoreTag: Telangana News
Mega Krishna Reddy | మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… | Eeroju news
మెగా కృష్ణారెడ్డి చుట్టూ రాజకీయం… హైదరాబాద్, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Mega Krishna Reddy మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్…
Read MoreRevanth Reddy | 54 అవతారాల్లో రేవంత్ | Eeroju news
54 అవతారాల్లో రేవంత్ ఖమ్మం, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Revanth Reddy ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఒక యువతి సొంతం చేసుకుంది. ఒకే వ్యక్తి చిత్రాన్ని వేరు వేరు గెటప్లలో ఉన్నట్లు తెల్లని కాగితం పై పెన్సిల్ ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ తో అద్భుతమైన చిత్రలేఖనం , కళాఖండాలు సృష్టిస్తూ.. వేలాది మందిని అబ్బుర పరుస్తుంది నిర్మల సాయిశ్రీ అనే యువతి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సంబంధించి 54 అవతారాల్లో అద్భుత కళాఖండాన్ని సృష్టించింది.తన తండ్రి ఒక ఫైన్ ఆర్ట్స్ కళాకారుడు. తండ్రి నుంచి అభిరుచి గా తీసుకున్న నిర్మల సాయిశ్రీ తాను కూడా చిత్రలేఖనం గీయడం ప్రారంభించింది. అల అలా.. తాను కూడా అద్భుతమైన పెన్సిల్ ఆర్టిస్ట్ గా ప్రావీణ్యం సాధించి ఎందరో…
Read MoreBandi Sanjay Kumar | కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి | Eeroju news
కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ Bandi Sanjay Kumar రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు. చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలని అన్నారు. కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్, నేను కొట్లాడాము. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. సమస్యను నేను డైవర్ట్ చేయడం లేదు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్ కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్,…
Read MoreKTR | కేటీఆర్ ధీమా ఏంటీ | Eeroju news
కేటీఆర్ ధీమా ఏంటీ హైదరాబాద్, నవంబర్ 8, (న్యూస్ పల్స్) KTR కేటీఆర్ టార్గెట్గా ప్రభుత్వం పావులు కదుపుతుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పండుగకు ముందే దీపావళి బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే ఫార్ములా ఈ రేసు నిధుల రిలీజ్పై కేటీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. బయట జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకే కేటీఆర్ మాట్లాడారా..లేక అలర్ట్ అయ్యారా అన్నదానిపై డిస్కషన్ జరుగుతోంది. అధికార పార్టీని డైలమాలో పడేసే వ్యూహంలో భాగంగానే ప్రెస్మీట్ పెట్టినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయమేంటో చెప్పారా..లేక అరెస్ట్పై కంగారు పడి మీడియా ముందుకు వచ్చారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పేం చేయలేదన్నట్లుగా చెప్తూనే..అరెస్ట్కు భయపడనంటూ కామెంట్స్ చేయడం మరింత చర్చనీయాంశం అవుతోంది. జైలుకు వెళ్లడానికి కూడా…
Read MoreKTR | కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..? | Eeroju news
కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..? హైదరాబాద్, నవంబర్ 7, (న్యూస్ పల్స్) KTR భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని టాక్ నడుస్తుంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమవ్వడంతో పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయం ఉంది. కేటీఆర్ జిల్లా పర్యటనల పైన దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు జిల్లాల పర్యటనలు , కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రైతు నిరసనల పేరుతో హరీష్ రావు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. హరీశ్ దూకుడుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వెనుక పడిపోతున్నారని చర్చ జరుగుతోంది.డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికే కేటీఆర్ రైతు…
Read MoreCongress vs BRS | కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ | Eeroju news
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగిన ద్వితీయ శ్రేణి నాయకులు నల్గోండ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Congress vs BRS సమగ్ర కుటుంబ సర్వేపై పార్టీ కార్యకర్తల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల వారీగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మూడు రోజుల కిందట నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేమలు వీరేశం నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరయ్యారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Read MorePonguleti Srinivasa Reddy | ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం | Eeroju news
ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు హైదరాబాద్, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Ponguleti Srinivasa Reddy తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అమలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో ఎత్తు. ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే నిబంధనల్లో కాస్త సడలింపులు ఇస్తోంది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయిన పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే మొదటి విడతకు మాత్రమే ఇది పరిమితం అవుతుందని తెలిపారు మంత్రి. ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ సర్వే…
Read MoreHYDRA | ఇక సినిమా చూపించబోతున్న హైడ్రా | Eeroju news
ఇక సినిమా చూపించబోతున్న హైడ్రా హైదరాబాద్, నవంబర్ 6, (న్యూస్ పల్స్) HYDRA అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్ స్టాలిన్నగర్లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా.ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటే బాగానే ఉండేది. కానీ అంతులేని నిర్లక్ష్యం వహించడంతో కబ్జాకోరులు పేట్రేగిపోయారు. పక్కా సర్వే నంబర్లు, బై నంబర్లతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఇక మియాపూర్…
Read MoreNagula Chaviti | ఘనంగా నాగుల చవితి వేడుకలు | Eeroju news
ఘనంగా నాగుల చవితి వేడుకలు హైదరాబాద్, విజయవాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Nagula Chaviti కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. కనుక చెట్టును, పుట్టను, రాయిని, నదులను, పశు పక్ష్యాదుల సహా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తారు. అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ లు చేస్తారు. పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా నాగు పాము పుట్టల వద్ద స్థానిక దేవాలయాల వద్ద సుబ్రహ్మణ్య స్వామీ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. పలు శ్రీ వల్లీ దేవసేనా సమేత…
Read More