Rushikonda Palace | రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… | Eeroju news

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా...

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… విశాఖపట్టణం, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Rushikonda Palace విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు.…

Read More