మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..? ముంబై, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) BRS మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరమైంది. గులాబీ పార్టీ పోటీ చేయడం లేదన్న సంకేతాలు ఇవ్వడంతో మహారాష్ట్రకు చెందిన ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర రాజ్యసమితి పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఒక్కటిగా ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతో ఇక జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని…
Read MoreTag: KCR
KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news
మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) KCR ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన చాలా వరకు పోరాడుతున్నారు. ఇటు వరుసగా ప్రెస్మీట్లు పెడుతూ.. వరుసగా మూసీ బాధితులను కలుస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి ధైర్యం ఇస్తున్నారు. మీ తరఫున తాము కొట్లాడుతామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. మరోవైపు.. మూసీ ప్రాజెక్టుపై ఎవరికి వారుగా అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ నిత్యం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. విలేకరుల సమావేశాలు పెడుతూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎవరికి వారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు…
Read MoreBRS | బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? | Eeroju news
బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? కరీంనగర్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) BRS అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్ఎస్ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావు పర్యటనల్లో హడావుడి…
Read MoreKCR | మౌనంగానే వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ | Eeroju news
మౌనంగానే వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) KCR అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తుంటి ఎముకకు గాయం కావడం ఆయణ్ని మరింత నీరసించేలా చేసింది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా… ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు తొలిరోజు హాజరైనా… ఆయన మునుపటిలా యాక్టివ్గా లేరు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సేద తీరుతున్న కేసీఆర్, అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్నారు. కానీ, రాజకీయంగా ఆయన బయటకు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడిదే అంశం.. గులాబీ శ్రేణులను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నిరుత్సాహపరుస్తోంది.ఇన్నాళ్లూ ఎలా ఉన్నా… ఇప్పుడు తెలంగాణ రాజకీయం మరోసారి రగులుతోంది. అధికారపక్షంతో నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి, పీఏసీ చైర్మన్ పదవి వివాదాస్పదం అవడం దాకా…. రుణమాఫీ నుంచి సెక్రటేరియట్…
Read MoreKCR | రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? | Eeroju news
రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? హైదరాబాద్ KCR బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగనున్నారు.ఈ బీఆర్ఎస్ పోరాటంపై శనివారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై…
Read MoreIs YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news
బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Read MoreMLC Kavitha | కవిత బెయిల్… | Eeroju news
కవిత బెయిల్… మూడు పార్టీల దాడులు..ఎదురుదాడులు హైదరాబాద్, ఆగస్టు 29 (న్యూస్ పల్స్) MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి. కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్…
Read MoreKCR Rythu Yatra | త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? | Eeroju news
త్వరలో కేసీఆర్ రైతు యాత్ర..? హైదరాబాద్ KCR Rythu Yatra మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తరు అసెంబ్లీకి రారు ప్రజా సమస్యలపై నోరు తెరవరా ప్రజల గోడు పట్టని నేతకు ప్రతిపక్ష నాయకత్వ పదవి ఎందుకు? ఇలా కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ రైతు యాత్రకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు నెరవేరటం లేదని. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్.. హరీష్ రావులు పోటీ పడి సవాళ్లు విసురుతూ యాత్రలు కూడా చేస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ బయట ఎక్కడా కనపడలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి, బడ్జెట్ పై…
Read MoreWhat is KCR’s strategy? | కేసీఆర్ వ్యూహం ఏమిటో | Eeroju news
కేసీఆర్ వ్యూహం ఏమిటో హైదరాబాద్, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) What is KCR’s strategy? తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర చాలా కీలకం… పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్… గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు… తన ఫాం హౌస్కు మాత్రమే పరిమితమయ్యారనే వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరుకావడం లేదు. ప్రస్తుత సభ కొలువుదీరిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు కేసీఆర్. అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగా, గత వారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్లో…
Read MoreTarget Revanth… | టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు | Eeroju news
టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Target Revanth… తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు చేరికలతో జోష్ మీద ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక కెసిఆర్ పార్టీ నిర్వీర్యమే అన్నంత రేంజ్ లో రాజకీయం నడిచింది. కోలుకోలేని దెబ్బ తగిలిందని..కెసిఆర్ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరికలు పెరగడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియక అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సరికొత్త రాజకీయ క్రీడకు తెర తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులకు గేట్లు…
Read More