తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad ప్రస్తుతం ఉన్న శంషాబాద్, బేగంపేట ఎయిర్పోర్ట్లు కాకుండా.. మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వరంగల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మరో 3 ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యామైన అంశాలు ఇలా ఉన్నాయి. 1.ఇటీవల జరిగిన వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2.ప్రభుత్వం తీసుకున్న చర్యలతో…
Read MoreTag: Eeroju news
Pawan Kalyan | ఎన్డీయే వారియర్ గా పవన్ | Eeroju news
ఎన్డీయే వారియర్ గా పవన్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Pawan Kalyan బీజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుందని భావించింది. 300 పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మిత్రులతో కలిసి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. కానీ 240 సీట్లు వద్ద బిజెపి బలం ఆగిపోయింది. మిత్రుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి 16, నితీష్ నేతృత్వంలోని జెడియు 12 స్థానాలతో ఆదుకున్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే.. బలం తగ్గిందన్న బాధ బిజెపి పెద్దలను వెంటాడింది. అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పదని సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో విజయం…
Read MorePriyanka Gandhi Vadra | ప్రచారం నుంచి ఎంపీ వరకు…. ప్రియాంక గాంధీ | Eeroju news
ప్రచారం నుంచి ఎంపీ వరకు…. ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Priyanka Gandhi Vadra 2 దశాబ్దాల క్రితం గాంధీ – నెహ్రూ కుటుంబం వారసురాలిగా పాలిటిక్స్కు పరిచయమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డు విజయం అందుకున్నారు. కేరళ వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చరిత్ర సృష్టించారు. ప్రచారంలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ‘తానో ఫైటర్’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బలంగా నిలిచాయి. ‘ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ.. ప్రజల తరఫున పోరాటం నాకు కొత్త కాదు. 30 ఏళ్లు గృహిణిగా పిల్లల సంరక్షణ,…
Read MoreRevanth Reddy | రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా | Eeroju news
రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా రేవంత్ ప్రచారం చేసినా ప్చ్… లాభం లేదు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revanth Reddy మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినచోట మంచి ఫలితాలు రాగా.. రేవంత్ ప్రచారం చేసి చోట కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది.…
Read MoreRam Gopal Varma ( RGV ) | తమిళనాడుకు ఆర్జీవీ…. | Eeroju news
తమిళనాడుకు ఆర్జీవీ…. ఒంగోలు, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Ram Gopal Varma ( RGV ) దర్శకుడు రామ్గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండుసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుకున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కకడే పట్టుకోవాలని చూస్తున్నారు. తమిళనాడులో ఉన్న ఆర్జీవీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నమోదు అయిన కేసుల వివరాలు, కోర్టు తీర్పులను పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన అరెస్టుకు సహకరించాలని వారిని కోరబోతున్నారు. ఆర్జీవీ ఇంట్లోనే విచారణ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లో…
Read MoreTammineni Sitaram | పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… | Eeroju news
పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… శ్రీకాకుళం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Tammineni Sitaram ఆమదాలవలసలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు నానితో పాటు కిల్లి సత్యనారాయణ హాజరుకాలేదు. వారితోపాటు వారి మద్దతుదారులు కొందరు సమావేశానికి ముఖం చాటేశారు. వారు హాజరుకాని వైనం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ను నియమించారు. మొన్నటి వరకూ ఇన్చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్కి అవకాశాన్ని జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆయనతోపాటు మొదట నుంచి తమ్మినేని కుటుంబం వెంట…
Read MoreVande Bharat Express | వందేభారత్ ఎక్స్ప్రెస్.. 14 బోగీల్లో…10 బోగీలు ఖాళీ | Eeroju news
వందేభారత్ ఎక్స్ప్రెస్.. 14 బోగీల్లో…10 బోగీలు ఖాళీ విశాఖపట్టణం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Vande Bharat Express వందేభారత్ ఎక్స్ప్రెస్.. చాలా రూట్లలో బాగా డిమాండ్ ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడిచే ట్రైన్కు డిమాండ్ నామమాత్రంగా కూడా లేదు. దీంతో ఈ రైలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో డిమాండ్ లేని రూట్లో ఎందుకు.. వేరే మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.చాలావరకు వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టికెట్లు లభించడం కష్టంగా ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ పరిస్థితి దారుణంగా. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్కు వెళ్తున్న వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్లో మాత్రం బోగీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్లో మొత్తం 14…
Read MoreRevenue Sadassulu in AP | డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు | Eeroju news
డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revenue Sadassulu in AP భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ సభల్లో స్వీకరించిన ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.వైసీపీ హయాంలో ఏపీలో భూముల రీసర్వే జరిగింది. దీంతో పాత సమస్యలతో పాటు కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. భూరికార్డుల ప్రక్షాళన పేరిట చేపట్టిన రీసర్వే ఇంకా పూర్తికాలేదు. ఇంతలో ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో భూముల రీసర్వే దాదాపుగా నిలిచిపోయింది. భూసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రామ,…
Read MoreBalineni vs Chevireddy… | విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారంలో బాలినేని వర్సెస్ చెవిరెడ్డి | Eeroju news
విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారంలో బాలినేని వర్సెస్ చెవిరెడ్డి ఒంగోలు, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Balineni vs Chevireddy… విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. అర్ధరాత్రి నిద్ర లేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారని మాజీ మంత్రి బాలినేని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం జగన్ పై అభాండాలు వేస్తున్నారని బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్ అయ్యారు.పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసింది. విద్యుత్ ఒప్పందాలకు అదానీ ప్రభుత్వాధినేతలకు లంచాలు ఇచ్చారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం, అదానీతో విద్యుత్ ఒప్పందాలకు..వైఎస్ జగన్ కు లంచం ఇచ్చారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వంలో విద్యుత్…
Read MoreCable war in AP…| బెజవాడలో కేబుల్ వార్… | Eeroju news
బెజవాడలో కేబుల్ వార్… విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Cable war in AP పీలో కేబుల్ వార్ నడుస్తోంది. కేబుల్ వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకునేందుకు కొందరు పావులు కదిపారు. కోట్లు కురిపించే కేబుల్ వ్యాపారంలో కొందరికి మాత్రమే లాభాలు దక్కుతున్నాయని, కళ్లు చెదిరే ఆదాయం కేబుల్ వ్యాపారంలో లభిస్తోందని గుర్తించిన రాజకీయ నేతలు తమ పరిధిలో కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకోడానికి పావులు కదిపారు. ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులకు ముఖ్యనాయకుల ఆశీస్సులు లభించడంతో విజయవాడలో కేబుల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం సులువైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న టీవీ ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ సానుభూతిపరులు…
Read More