KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news

మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ

మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) KCR ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచి ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన చాలా వరకు పోరాడుతున్నారు. ఇటు వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. వరుసగా మూసీ బాధితులను కలుస్తూ వస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి ధైర్యం ఇస్తున్నారు. మీ తరఫున తాము కొట్లాడుతామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. మరోవైపు.. మూసీ ప్రాజెక్టుపై ఎవరికి వారుగా అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ నిత్యం చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. విలేకరుల సమావేశాలు పెడుతూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎవరికి వారుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు…

Read More

Surya vs Vikram | దీపావళికి సూర్య వర్సెస్ విక్రమ్ | Eeroju news

దీపావళికి సూర్య వర్సెస్ విక్రమ్

దీపావళికి సూర్య వర్సెస్ విక్రమ్ చెన్నై, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Surya vs Vikram తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కమల్ హాసన్, రజినీకాంత్ లకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్లిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలను చేస్తున్నందుకు గాను వాళ్ళు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో నిరాశపరిచినప్పటికి మరోసారి భారతీయుడు 3 సినిమాని లైన్ లో పెడుతూన్నాడు. అలాగే రజనీకాంత్ కూడా రీసెంట్ గా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.…

Read More

Wayanad By Elections | వ‌య‌నాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ | Eeroju news

వ‌య‌నాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్

వ‌య‌నాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ తిరువనంతపురం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Wayanad By Elections కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ అధిష్టానం ప్రియాంక గాంధీపై పోటీకి నవ్య హరిదాస్ (39)ను బరిలోకి దింపేందుకు…

Read More

India | వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా | Eeroju news

వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా

వండర్లు క్రియేట్ చేస్తున్న మేకిన్ ఇండియా ముంబై, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) India భారత్‌ మారుతోంది. ఒకప్పుడు ఎన్నో దిగుమతులు.. ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే. మేకిన్‌ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. ప్రధాని మోదీ కలలు సాకారమవుతుండడంతో పాటు.. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. 2014లో ప్రతిష్టాత్మకంగా మేకిన్‌ ఇండియాను లాంచ్‌ చేశారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో టాప్‌ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు కలలు కన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది. 2014లో దేశంలో 80శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పుడు 99.9శాతం మొబైల్స్‌ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు.. యూకే, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఇటలీ, సౌతాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌తోపాటు.. అంతరిక్షం,…

Read More

Telangana | హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ | Eeroju news

హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ

హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ రంగారెడ్డి Telangana హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కుంది. నరక యాతన అనుభవిస్తున్న కొండ చిలువను జల మండలి సిబ్బంది గుర్తించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు స్నేక్ సొసైటీ సభ్యులువచ్చి క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ ను కాపాడారు. దైర్యం గా క్రస్ట్ గేటు వద్ద కు దిగి. పాము నోటిని పట్టుకొని తాడు సహాయం తో మీదకు వచ్చారు. తరువాత అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం కు కొట్టుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.   Vidadala Rajini | బయిటకొస్తున్న విడుదల రజనీ అక్రమాలు | Eeroju…

Read More

Social War | సోషల్ వార్ కు రెఢీ.. | Eeroju news

సోషల్ వార్ కు రెఢీ..

సోషల్ వార్ కు రెఢీ.. ఒంగోలు, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Social War వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప‌క్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సోస‌ల్ మీడియా విష‌యంలోనూ ఆయ‌న చాలాదూకుడుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌లు అయిపోయి.. నాలుగు మాసాలు గ‌డిచాయి. ఈ నాలుగు మాసాల కాలంలో పార్టీ నేత‌లు ఎలా ఉన్నా..ఇప్ప‌టి నుంచి మాత్రం ప‌క్కాగా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే..ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు.అయితే.. మ‌రీ ముఖ్యంగా, ప్ర‌జ‌లే కాకుండా.. సోష‌ల్ మీడియాపై క‌న్నేయాల‌ని పార్టీ కేడ‌ర్ స‌హా నాయ‌కులకు సూచించారు. కేవ‌లం మీడియా మీటింగులు, స‌భ‌లు స‌మావేశాలే కాకుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం తో పాటు సోష‌ల్ మీడియాతోనూ స‌మ‌రం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ప‌రంగా కూడా…

Read More

Sarada Peetham | శారద పీఠానికి షాక్… | Eeroju news

శారద పీఠానికి షాక్...

శారద పీఠానికి షాక్… హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద విశాఖపట్టణం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Sarada Peetham విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి…

Read More

Chandra Babu.. Narendra Modi & Pawan Kalyan | చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. | Eeroju news

చంద్రబాబు, పవన్ కు మోదీ నిర్దేశం..

చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. కాకినాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Chandra Babu.. Narendra Modi & Pawan Kalyan దేశంలో ఒకే ఒక్క ఎన్నికలు తేవాలన్నది మోడీ టార్గెట్. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన మోడీ.. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు వ్యతిరేక కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి. మోడీ అనుకున్నట్టు జరిగితే ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయిఏపీలో కూటమి నేతల స్వరం మారుతోంది. వారి నోట ఎన్నికల మాట వినిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఏపీలో కూటమి పార్టీల నేతలు సైతం అందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుగులేని విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను.. ఏకంగా 164 స్థానాలతో సత్తా…

Read More

Railway | రైలు బస్సు కావాలంటున్న కోనసీమ వాసులు | Eeroju news

రైలు బస్సు కావాలంటున్న కోనసీమ వాసులు

రైలు బస్సు కావాలంటున్న కోనసీమ వాసులు కాకినాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Railway దేశంలోని అన్ని రాష్ట్రాలు టూరిజం పరంగా ఎలాంటి క్రొత్త కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంటే ఏపీలో మాత్రం చేతిలో ఉన్న ఒక గొప్ప అవకాశాన్ని రైల్వే పక్కన పెట్టేస్తుంది. అదే ” రైలు బస్సు”. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా లేని అరుదైన ” రైలు బస్సు” నిన్న మొన్నటి వరకూ ఏపీలో తిరిగేది. అయితే కరోనా పేరు చెప్పి దానిని రద్దు చేసింది డిపార్ట్మెంట్.కోనసీమకు రైలు తేవాలని దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చేసిన కృషి ఫలితంగా కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైన్ ఏర్పడింది. అక్కడి నుంచి గోదావరి మీదుగా బ్రిడ్జి నిర్మించి నర్సాపూర్‌కు లింక్ ఏర్పాటు చేస్తే కోనసీమకు రైల్వే లైన్ వచ్చేసినట్టే. అయితే…

Read More

Vizianagaram | విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం | Eeroju news

విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం

విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం విజయనగరం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. గుర్ల మండలంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయోరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య…

Read More