Railway Lands Issue | రైల్వే స్థలాలతో నయా రాజకీయం | Eeroju news

రైల్వే స్థలాలతో నయా రాజకీయం

రైల్వే స్థలాలతో నయా రాజకీయం విజయవాడ, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Railway Lands Issue విజయవాడలో దశాబ్దాలుగా సాగుతున్న రైల్వే స్థలాల ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. గత మూడు నాలుగు దశాబ్దాలుగా నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే జెండాలు పాతడం, కాలనీలకు కాలనీలు పుట్టుకొస్తున్నా అధికారులు చోద్యం చూశారు. నేడు దానికి మూల్యం చెల్లిస్తున్నారు.విజయవాడ నగరం నడిబొడ్డున ఖరీదైన రైల్వే స్థలాలు ఏళ్ల తరబడి కబ్జాలకు గురవుతున్నా రైల్వే అధికారులు చోద్యం చూస్తుండటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనులకు భూమి అవసరమైనా వినియోగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నై-న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్‌ మార్గంలో విజయవాడ పర్మనెంట్‌ వే డిపార్ట్‌మెంట్‌ సౌత్ సెక్షన్ పరిధిలో ఉన్న రైల్వే భూములు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతూ వచ్చాయి. మొదట్లో సంచార జాతుల ప్రజలు…

Read More

Rushikonda Palace | రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… | Eeroju news

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా...

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… విశాఖపట్టణం, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Rushikonda Palace విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు.…

Read More

Temple Tour Package | వచ్చేసిన టెంపుల్ టూర్ ప్యాకేజీ | Eeroju news

వచ్చేసిన టెంపుల్ టూర్ ప్యాకేజీ

వచ్చేసిన టెంపుల్ టూర్ ప్యాకేజీ కాకినాడ, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Temple Tour Package అక్టోబర్ 26 నుంచి ఏపీ టూరిజం టెంపుల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 ఆధ్యాత్మిక ఆలయాలను కవర్ చేయవచ్చు. ఏపీ టూరిజం అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కుందల దుర్గేష్ ఓ ప్రకటన చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పంచారామ క్షేత్రాలను కవర్ చేస్తూ ఒక రోజు వీకెండ్ టూర్ ప్యాకేజీకి అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. 6 పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను…

Read More

Vijayawada | ట్రాక్టర్లతో దిగుమతి…. ట్రక్కుల్లో ఎగుమతి | Eeroju news

ట్రాక్టర్లతో దిగుమతి.... ట్రక్కుల్లో ఎగుమతి

ట్రాక్టర్లతో దిగుమతి…. ట్రక్కుల్లో ఎగుమతి విజయవాడ అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Vijayawada ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తోంది. విధానంలోని లోపాలను అసరాగా చేసుకున్న అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పేదలను అడ్డుపెట్టుకొని జేబులు నింపుకుంటున్నారు. వాగుల నుంచి ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోకి తీసుకొచ్చి.. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా పట్టణాలు, నగరాలకు ఎగుమతి చేస్తున్నారు.కృష్ణా జిల్లాలో ఉన్న బుడమేరు అక్రమార్కులకు వరంగా మారింది. ఇటీవల వరదలు రావడంతో బుడమేరులో ఇసుక మేటలు గట్టిగా ఉన్నాయి. బుడమేరుకు అటు, అటు ఉన్న గ్రామాల్లోని కొందరు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకొస్తున్నారు. గ్రామాల్లోని ఒకచోట దిగుమతి చేస్తున్నారు. ఇసుకాసురులు టిప్పర్లతో అక్కడ వాలిపోతున్నారు. టిప్పర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు.మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం చిన నందిగామ సమీపంలో నాణ్యమైన…

Read More

Liquor sales | శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు | Eeroju news

శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు

శివారు గ్రామాల్లో తగ్గన మద్యం అమ్మకాలు విజయవాడ, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Liquor sales ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. కస్టమర్లకు నచ్చిన మద్యం విక్రయిస్తున్నారు. ఏపీలో నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ వైన్ షాపుల్లో మద్యం విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది.ఏపీలో మందుబాబులు… ఎన్నాళ్లో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కళ్ల ముందు క్వాలిటీ మద్యం కనిపిస్తుంటే ఆ ఆనందం చెప్పలేనంత అంటున్నారు. అయితే ధరల విషయం మాత్రం మందుబాబులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. క్వాలిటీ మద్యం అయితే దొరుకుతుంది కానీ ధరలు మాత్రం తగ్గలేదంటున్నారు. మరికొన్ని రోజుల్లో మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఇటీవల కొత్త మద్యం…

Read More

AP New Liquor Policy | ఏపీలో కిక్కే కిక్కు | Eeroju news

ఏపీలో కిక్కే కిక్కు

ఏపీలో కిక్కే కిక్కు నెల్లూరు, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) AP New Liquor Policy కొత్త సీసా..కొత్త మందు..తగ్గిన రేటు. ఇక కిక్కే కిక్కు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మందు బాబులకే కాదు..లిక్కర్ వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా మంచిరోజులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో టేస్ట్‌ లేని మందు..నోటితో పలకలేని బ్రాండ్లు చూసి చిర్రెత్తిపోయిన మందుబాబులు..ఇప్పుడు లో కాస్ట్‌కే ప్రీమియం లిక్కర్‌ను తాగి ఎంజాయ్ చేస్తున్నారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులకు కూడా మంచిగానే బిజినెస్ అవుతోంది. ఇక ప్రభుత్వానికి టెండర్ ఫీజ్‌ నుంచి సేల్స్‌ వరకు ఖజానాలో కాసులు వచ్చి పడుతూనే ఉన్నాయి. కొత్త లిక్కర్ షాపులు తెరుచుకుని వారం రోజులే అయింది. ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్ జరుగుతున్నాయి. ఏకంగా ఆరు వందల కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఇలా తెరుచకున్నాయో…

Read More

CM Chandrababu | పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు | Eeroju news

పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు

పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం.. సీఎం చంద్రబాబు అమరావతి, CM Chandrababu పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్ పోలీస్ గా తీర్చిదిద్దేలా ముందుకెళ్లామని తెలిపారు. పోలీస్ సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని సీఎం అన్నారు. Amaravathi | అమరావతికి కొత్త కళ | Eeroju news

Read More

Bachupally Narayana College | బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం | Eeroju news

బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం

బాచుపల్లి నారాయణ కాలేజీలో దారుణం హైదరాబాద్, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Bachupally Narayana College హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. అనూష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దసరా సెలవుల తర్వాత నిన్ననే కాలేజీకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు కాలేజీలో దింపి హైదరాబాద్‌ దాటే లోపే విద్యార్థిని స్పృహ కోల్పోయిందన్న సమాచారం వచ్చింది. అనూష ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె మృతదేహాన్ని గాంధీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనూష అనే విద్యార్ధిని బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులు అనంతరం అనూషను.. ఆమె తల్లి దండ్రులు ఆదివారం నాడు హాస్టల్‌లో వదిలిపెట్టి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే విద్యార్దిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని…

Read More

Telangana | తెలంగాణ ఆదాయం తగ్గింది | Eeroju news

తెలంగాణ ఆదాయం తగ్గింది

తెలంగాణ ఆదాయం తగ్గింది హైదరాబాద్ Telangana మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక అంశాల పై మాట్లాడారు. .ఆర్థిక శాఖ పై సచివాలయం లో సమీక్ష చేసినపుడు సీఎం ఓ రకంగా ఐఎస్బీ కార్యక్రమం లో మరో రకంగా మాట్లాడారు. రాష్ట్రానికి మద్యం ఆదాయం మినహా అన్నిటిలో తగ్గింది. సీఎం రాష్ట్ర ఆదాయం తగ్గుదల విషయం లో ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. .రాష్ట్రానికి ఆదాయం ఎందుకు తగ్గిందని సీఎం లోతుగా సమీక్ష చేయడం లేదు రేవంత్ పదినెలల్లో ఏ వర్గం లో విశ్వాసం నమ్మకం కలిగించలేకపోయారు ..అందుకే ఆదాయం తగ్గిందని అన్నారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పై పడింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం…

Read More

Supreme Court | మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే | Eeroju news

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే

మదర్సాల విషయంలో సుప్రీంకోర్టు స్టే న్యూఢిల్లీ అక్టోబర్ 21 Supreme Court మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. యూపి, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. యూపి ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ జామియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి. పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు…

Read More