Atchannaidu son’s political entry | అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… | Eeroju news

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ...

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… శ్రీకాకుళం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Atchannaidu son’s political entry తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు క్రమంగా సీనియర్ నేతలకు అర్ధమవుతున్నాయి. ఒకవైపు జరుగుతున్న పరిణామాలతో ముందు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్లు పార్టీ లో ఫేడ్ అవుట్ అయ్యారు. కేబినెట్ కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ.. చినబాబు నారా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రి వర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏది చూసినా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. సీనియర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. కుటుంబ నేపథ్యం, పార్టీలో వారికున్న ట్రాక్ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీనియర్ నేతలు అనే…

Read More

TDP VS Janasena | దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన | Eeroju news

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన ఏలూరు, నవంబర్ 4, (న్యూస్ పల్స్) TDP VS Janasena కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. మద్యం దుకాణాల కేటాయింపు, ఇసుక సిండికేట్లు, నామినేటెడ్ పదవుల విషయంలో ఇలా ప్రతి విషయంలో ఒకరినొకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు స్వీప్ చేసిన తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా కనపడుతుంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ కూటమి నేతల మధ్య విభేదాలు పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారాయి.. ప్రధానంగా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు…

Read More

Ramachepa | రామచేప రేటే వేరప్పా…. | Eeroju news

రామచేప రేటే వేరప్పా....

రామచేప రేటే వేరప్పా…. కాకినాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Ramachepa పులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతం. పల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే.. ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7…

Read More

RCs and driving licenses in smart cards | స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు… డ్రైవింగ్ లైసెన్సులు | Eeroju news

స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు.. డ్రైవింగ్ లైసెన్సులు

స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు.. డ్రైవింగ్ లైసెన్సులు రాజమండ్రి, నవంబర్ 4, (న్యూస్ పల్స్) RCs and driving licenses in smart cards కొత్త వెహిక‌ల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు స్మార్ట్ కార్డుల్లో ఇవ్వనున్నట్లు రవాణా శాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లు స్మార్ట్‌కార్డుల్లో రానున్నాయి. కొత్త వెహిక‌ల్స్ కొనేవారికి, లైసెన్స్‌లు తీసుకునేవారికి రాష్ట్రం ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని ర‌వాణా శాఖ‌లో స్మార్ట్ కార్డుల‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. స్మార్ట్ కార్డుల స‌ర‌ఫ‌రాకు టెండ‌ర్ల పిలిచేందుకు ప్రక్రియ మొద‌ల పెట్టింది. కొత్త వాహ‌నం కొనుక్కుని, ర‌వాణా శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ పొందిన‌ప్పుడు అంద‌జేసే డీఎల్ కార్డుల…

Read More

AP Budget | 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ | Eeroju news

11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP Budget ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా… పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 11వ తేదీన లేదా మరునాడు వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం…

Read More

AP New ration cards | జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు | Eeroju news

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP New ration cards   కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్‌ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్…

Read More

Telangana | టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ | Eeroju news

టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్

టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ మెదక్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Telangana టీటీడీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడి రేసులో బాబూమోహన్‌, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు.నెల రోజుల క్రితం చంద్రబాబును బాబూమోహన్‌ కలిశారు. అలాగే, రెండు రోజుల క్రితం ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని తీగల కృష్ణా రెడ్డి చెప్పారు. ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. జీహెచ్ఎంసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టీడీపీ ఉంది. వారం పది రోజుల్లో టీటీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. బాబూమోహన్‌ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ…

Read More

KTR Getting Ready To Go On A Padayatra As State | పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్ | Eeroju news

పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్

పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్ హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) KTR Getting Ready To Go On A Padayatra As State తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓ వైపు నేతలు, మరోవైపు కేడర్ వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది కారు పార్టీ. కొత్త కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది. లేటెస్ట్‌గా రాష్ట్రమంతా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతోంది కారు పార్టీ. అధికార పార్టీ నుంచి వస్తున్న మాటల యద్దాన్ని ఎదుర్కోలేక పోతోంది. ఈ క్రమంలో నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంలో హైకమాండ్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇతర పార్టీల తరహాలోనే అధికార మార్గాలు వెదుకుతున్నట్లుగా కనిపిస్తోంది. పదేళ్లు అధికారాన్ని చెలాయించిన…

Read More

Revanth Reddy | అర్ధం కానీ రేవంత్ వ్యూహం | Eeroju news

అర్ధం కానీ రేవంత్ వ్యూహం

అర్ధం కానీ రేవంత్ వ్యూహం హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Revanth Reddy మరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు “… ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి. ఆయన ఎక్కడ అన్నారు అంటే ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టాగోష్టి మాటలు. మీడియా ప్రతినిధులతో మాట్లాడితే ఆటోమేటిక్ గామీడియాలో వస్తాయి. వచ్చాయి కూడా. ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. వచ్చింది కూడా. చాలా మంది వచ్చి ..కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు. రేవంత్ రెడ్డి…

Read More

Hyderabad | మూసీ పునరుజ్జీవ అడుగులు.. | Eeroju news

మూసీ పునరుజ్జీవ అడుగులు..

మూసీ పునరుజ్జీవ అడుగులు.. హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Hyderabad ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మూసీపై ప్రకటనలే కాదు.. పునరుజ్జీవం దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకటిన్నర లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. 15 రోజుల్లో గోదావరి నీటిని గండిపేటకి తరలించేందుకు…

Read More