. 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు.. విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) 2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని అన్నారు. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ నిస్తున్నట్లు తెలిపారు.క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు గురించి ప్రస్తావించారు. ప్రవేట్…
Read More