రైతులకు యూనిక్ ఐడీతోనే సేవలు రాజమండ్రి, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) ప్రభుత్వ డిజిటల్ మిషన్లో భాగంగా రైతులకు ఇప్పుడు కేంద్రప్రభుత్వం యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు పదకొండకెల నెంబరు, రిజిస్ట్రర్ ఐడీద్వారా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయబోతుంది.. అంతేకాకుండా ఇకపై ఈ ఐడీ ఆధారంగానే రైతుకు సంబందించిన అన్ని కార్యకలాపాలు నిర్వహించబోతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా గత 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈప్రక్రియ వేగవంతంగా పూర్తిచేస్తోంది.. ఇప్పటికే 50 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తికాగా మరింత వేగవంతం చేస్తోంది.. ఇకపై ఈ యూనిక్ ఐడీ జనరేట్ అయితేనే పథకాలు వర్తిస్తాయి..వెబ్ల్యాండ్ డేటాను అగ్రి స్టాగ్ అనే వెబ్ సైట్కు ఫార్మర్ రిజిస్ట్రీ అనుసంధానించారు.. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన…
Read More