Revanth Reddy | రేవంత్ వ్యూహం | Eeroju news

రేవంత్ వ్యూహం

రేవంత్ వ్యూహం హైదరాబాద్, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Revanth Reddy   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఒవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుంది.అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణమున్నట్లే.. ఒవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని…

Read More