Revenge politics in AP | రీవెంజ్ రాజకీయాలేనా…. | Eeroju news

Revenge politics in AP

రీవెంజ్ రాజకీయాలేనా…. విశాఖపట్టణం, జూన్ 29, (న్యూస్ పల్స్) Revenge politics in AP ఏపీలో రివేంజ్ రాజకీయాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. కానీ వస్తూ వస్తూ మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో పాలన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలని వాటిలో పొందుపరిచారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని ఒకవైపు ప్రకటిస్తూనే.. తెర వెనుక సామ, దాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన అంటూ ప్రజల్లోకి వెళ్లిన వారే.. అధికారంలోకి వచ్చాక అదే తరహా పాలన ప్రారంభించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదర్శం మాటల వరకే పరిమితం అయిందని.. చేతలు చెయ్యి దాటి పోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజులపాటు పాలనపై దృష్టి సారిస్తే గత ప్రభుత్వ వైఫల్యాలు…

Read More