బిల్లులా… కేసులా…. | Eeroju news

విజయసాయిరెడ్డి అమిత్ షా ను కలవడం

బిల్లులా… కేసులా…. అంతు పట్టని అంతరంగం విశాఖపట్టణం, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) జయసాయిరెడ్డి బిజెపిలో చేరతారా? ఆ పార్టీ సేఫ్ జోన్ అని భావిస్తున్నారా? కేసులకు భయపడుతున్నారా? అందుకే తరచూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వారం రోజుల వ్యవధిలో విజయసాయిరెడ్డి అమిత్ షాను కలవడం రెండోసారి. సాధారణంగా అమిత్ షా అపాయింట్మెంట్ అంత ఈజీగా లభించదు. ఆయన కేంద్ర హోంమంత్రి తో పాటు బిజెపిలో కీలక నేత. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. అటువంటి నేతతో వరుసగా విజయసాయిరెడ్డి భేటీలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసిపి కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి పై అనేక రకాల కేసులు ఉన్నాయి. వైసిపి హయాంలో భూకబ్జా చేశారన్న ఆరోపణలు…

Read More