Farmers of Amaravati visited Tirumala Srivari | తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న అమరావతి రైతులు | Eeroju news

తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న అమరావతి రైతులు

తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న  అమరావతి రైతులు తిరుమల Farmers of Amaravati visited Tirumala Srivari ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. 30 మంది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నారు. సోమవారం ఉదయం  శ్రీవారిని దర్శించుకున్నారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా సాగించిన విషయం తెలిసిందే.   Trek from Amaravati to…

Read More