Kharif purchases | అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు | Eeroju news

అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు

అక్టోబరు 1 నుంచి ఖరీఫ్ కొనుగోళ్లు విజయవాడ, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Kharif purchases ఖరీప్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకి సొమ్ము చేరుతుందని వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తామని….. ప్రతీ రైతుకీ భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ఏఐఐబీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

Read More