New Delhi:144 కోట్లు దాటిన భారత జనాభా

India's population exceeds 1.44 billion

New Delhi:144 కోట్లు దాటిన భారత జనాభా:పంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు ఉన్న భారత్‌లో జనాభా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. 150 కోట్లవైపు వేగంగా దూసుకెళ్తోంది. మరో 77 ఏళ్లలో భారత జనాభా 2011 లెక్కల ప్రకారం రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది. ఈమేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈమేరకు పేర్కొంది. ఈ నివేదికలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పదేళ్లుగా ఇండియాలో శిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపింది. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు.

144 కోట్లు దాటిన భారత జనాభా

న్యూఢిల్లీ, మార్చి 13
పంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు ఉన్న భారత్‌లో జనాభా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. 150 కోట్లవైపు వేగంగా దూసుకెళ్తోంది. మరో 77 ఏళ్లలో భారత జనాభా 2011 లెక్కల ప్రకారం రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది. ఈమేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈమేరకు పేర్కొంది. ఈ నివేదికలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పదేళ్లుగా ఇండియాలో శిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపింది. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. ఇప్పుడు అది 144.17 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంచనా వేసింది. 13 ఏళ్లలో 23 కోట్ల మంది పెరిగినట్లు తెలిపింది. ఇక చైనా 142.5 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.ఇక ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్‌లో యువ జనాభా పెరిగింది. జనాభాలో 14 ఏళ్లలోపు వారు 24 శాతం మంది ఉన్నారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లు 17 శాతం ఉండగా, 10 నుంచి 24 ఏళ్ల మధ్య యువత 68 శాతం ఉంది. ఇక 65 ఏళ్లు దాటిన వారి జనాభా కేవలం 7 శాతంగా ఉంది. ఇండియాలో యువ జనాభా ఎక్కువగా ఉండడం దేశ అభివృద్ధికి అనుకూల అంశం.ఇక భారత్‌లో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో పురుషుల సగటు ఆయుష్షు 71 ఏళ్లు ఉండగా, మహిళల ఆయుష్షు 74 ఏళ్లుగా ఉందని వివరించింది.మొత్తంగా ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారత్‌లో జనాభా పెరుగుతున్నా.. దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి. ఆరోగ్య రంగం మెరుగుపడుతోంది. ఆయుష్షు పెరుగుతోంది. శిశు మరణాలూ తగ్గుతున్నాయి. ఇవన్నీ శుభసూచకమే అని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. భారత జనాభా 150 కోట్లకు చేరిన తర్వాత.. తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

దేశం కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతోందా.. దేశంలో గాలి నాణ్యత వేగంగా పడిపోతుందా అంటే పర్యావరణ నివేదికలు అదే చెబుతున్నాయి. రోజు రోజుకూ దేశంలో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. గాలి నాణ్యత పడిపతోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు 20 ఉండగా, అందులో 13 దేశాలు భారత్‌లోనే ఉండడం గమనార్హం.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌ ఒక ప్రముఖ స్థానంలో ఉంది. 2024లో స్విస్‌ ఎయిర్‌ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ IQAir విడుదల చేసిన ‘వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌‘ ప్రకారం, ప్రపంచంలోని టాప్‌ 20 కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనివే ఉన్నాయి. ఈ జాబితాలో మేఘాలయలోని బైర్నీహట్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా గుర్తింపు పొందింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లోని 13 కాలుష్య నగరాలు
బైర్నీహట్‌(మేఘాలయ) అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా రికార్డు సష్టించింది.
ముల్లన్‌పూర్‌ (పంజాబ్‌)
ఫరీదాబాద్‌ (హర్యానా)
లోనీ(ఉత్తరప్రదేశ్‌)
న్యూఢిల్లీ
గురుగ్రామ్‌(హర్యానా)
గంగానగర్‌(రాజస్థాన్‌)
గ్రేటర్‌ నోయిడా(ఉత్తరప్రదేశ్‌)
భివాడీ(రాజస్థాన్‌)
ముజఫ్ఫర్‌నగర్‌(ఉత్తరప్రదేశ్‌)
హనుమాన్‌గఢ్‌ (రాజస్థాన్‌)
నోయిడా (ఉత్తరప్రదేశ్‌)
ఈ రిపోర్ట్‌లో కాలుష్య స్థాయిలను PM2.5 (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5) ఆధారంగా కొలుస్తారు. PM2.5 అనేది 2.5 మైక్రోమీటర్ల కంటే చిన్న కణాలను సూచిస్తుంది, ఇవి ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోయి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. భారత్‌లో సగటు PM2.5 స్థాయి 2024లో 50.6 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌గా నమోదైంది, ఇది 2023లో 54.4తో పోలిస్తే 7% తగ్గినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన సురక్షిత స్థాయి (5 మైక్రోగ్రామ్స్‌) కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఢిల్లీలో సగటు PM2.5 స్థాయి 91.6 మైక్రోగ్రామ్స్‌గా ఉంది. ఇది WHO సురక్షిత పరిమితి కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ.
కాలుష్యానికి కారణాలు..
భారత్‌లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలు:
వాహన ఉద్గారాలు: ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో ట్రాఫిక్‌ సాంద్రత వల్ల ఎక్కువ కాలుష్యం.
పారిశ్రామిక కాలుష్యం: ఫరీదాబాద్, భివాడీ వంటి ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు.
పంటల అవశేషాల దహనం: పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో స్టబుల్‌ బర్నింగ్‌ వల్ల ఉత్తర భారతదేశంలో కాలుష్యం పెరుగుతోంది.
నిర్మాణ ధూళి: వేగంగా అభివద్ధి చెందుతున్న నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు.
వాతావరణం: శీతాకాలంలో ఉష్ణోగ్రత తలక్రిందులు కావడం వల్ల కాలుష్య కణాలు గాలిలో చిక్కుకుంటాయి.
ఆరోగ్య ప్రభావం
భారత్‌లో వాయు కాలుష్యం ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా మారింది. ఇది సగటు జీవిత కాలాన్ని 5.2 సంవత్సరాలు తగ్గిస్తుందని అంచనా. లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ అధ్యయనం ప్రకారం, 2009–2019 మధ్య ఏటా సుమారు 15 లక్షల మరణాలు PM2.5 కాలుష్యంతో సంబంధం కలిగి ఉన్నాయి.ప్రపంచంలోని టాప్‌ 20 కాలుష్య నగరాల్లో 13 భారత్‌లో ఉండటం ఆందోళనకరం. ఢిల్లీ వంటి రాజధాని నగరం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంటే, బైర్నీహట్‌ వంటి చిన్న పట్టణాలు కూడా ఈ జాబితాలో చేరడం వాయు కాలుష్య సమస్య విస్తృతిని చూపిస్తోంది. ప్రభుత్వం ’నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌’ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ, కఠిన నియంత్రణలు, ప్రజల సహకారం లేకుండా ఈ సమస్యను అధిగమించడం కష్టం. వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Read more:New Delhi: ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు

Related posts

Leave a Comment