Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news

Kavita is the next step

కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ

హైదరాబాద్, ఆగస్టు 13, (న్యూస్ పల్స్)

Kavita is the next step

ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఈఏడాది మార్చి 15న అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ తనయ ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్‌ కోసం అనేక కారణాలతో వేసిన పిటిషన్లను ఇటు రవూస్‌ అవెన్యూ కోర్టు.. అటు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వకూడదని వాదిస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పటి వరకు చేసిన బెయిల్‌ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా ఆమె ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిల్‌ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఆమెకు  నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం నిరాకరించింది.

ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారుఓ ప్రజాప్రతినిధిగా, మహిళ అయిన కవితను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌ పొందిన మనీశ్‌ సిసోడియా, కేజ్రీవాల్‌ కేసులను ఉదహరించారు. అయితే, రోహత్గీ వాదనల సందర్బంగాం కేసు పెట్టిన ఈడీ, సీబీఐలకు తాము నోటీసులు జారీ చేస్తామని జస్టిస్‌ గవాయి స్పష్టంగా చేశారు. దీంతో కనీసం మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వండి అని కవిత లాయర్‌ రోహత్గీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు జస్టిస్‌ గవాయి నిరాకరించారు. వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే వాదనలు వింటామని తెలిపారు. అప్పటి వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు అఫిడవిట్‌ ఫైల్‌ చేయాలని ఈడీ, సీబీఐలకు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే కవిత రవుస్‌ అవెన్యూ కోర్టును, ఢిల్లీ హైకోర్టును పలుమార్లు బెయిల్‌ కోసం ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వొద్దని వాదించాయి. ఈ స్కాంలో కవితే కీ పిన్‌ అని, ఆమె సాధారణ వ్యక్తి కాదని, బయటకు వస్తే సాక్షాలు తారుమారు చేస్తారని తెలిపాయి. ఇప్పటికే మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని విన్నవించాయి. మహిళ అనే కారణంగా బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా కవితను దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో కోర్టులు ఏకీభవించాయి. దీంతో బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు 5 నెలల నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నాలు అంటూ లేదు. తాజాగా సోమవారం కూడా సుప్రీంకోర్టులో బెయిల్ కు సంబంధించి కవితకు మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఒప్పుకోలేదు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ” కవిత ఒక మహిళా ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్సీగా ఉన్నారు. విచారణ పేరుతో ఆమెను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారు. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. వారికి బెయిల్ మంజూరయింది.

కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని” రోహత్గీ వాదించారు.రోహత్గీ వాదనల సమయంలోనే ఈడీ, సీబీఐ లకు నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ గవాయి పేర్కొనడం విశేషం. ఇదే క్రమంలో కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు లాయర్ రోహత్గీ న్యాయస్థానాన్ని విన్నవించారు. ఇందుకు గవాయి ఒప్పుకోలేదు. వారు అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే.. వాదనలు వింటామని.. అప్పటివరకు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 20 కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈలోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఈడీ, సీబీఐ కి ఆదేశాలు జారీ చేసింది. ఇక కవిత ఇప్పటికే దిగువ న్యాయస్థానాలలో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా కౌంటర్ ఇచ్చాయి..”కవిత సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఇలాంటి సమయంలో విచారణ అనేది పక్కదారి పడుతుంది. అలాంటప్పుడు ఆమె జైల్లోనే ఉండాలని” దర్యాప్తు సంస్థలు కోర్టుకు విన్నవించాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయలేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో.. కవితకు కూడా ఊరట లభిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు మరోసారి నిరాశలో మునిగిపోయారు. కాగా ఇటీవల కవిత అరెస్టుకు సంబంధించి తొలిసారి కేసీఆర్ స్పందించారు. బిడ్డ అరెస్టు అయితే ఈ తండ్రికి మాత్రం బాధ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

Kavita is the next step

 

MLC Kavitha’s case in the Supreme Court | సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు | Eeroju news

Related posts

Leave a Comment