Hyderabad:రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం:నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు.
రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం
నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ని తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసారు.
సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం
కేటీఆర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గ్యారెంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా?
అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలం.. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం?
ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడమని అన్నారు. లేనిది ఆదాయం కాదు.. నీ మెదడులో విషయం.
స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి.
పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు .
ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా, అంగన్వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా?
ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం .
ఉద్యోగులు సహకరించడం లేదనడం.. వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.
పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందలేస్తే సహించమని హెచ్చరించారు.
అబద్దాలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై వాడి వేడి చర్చ జరిగింది. రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దళితుడిని సిఎం చేస్తా అన్నారు చేయలేదు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. రైతులకోసం ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు. నాగార్జున సాగర్, శ్రీశైలం ఎవరు కట్టారో అందరికీ తెలుసు. చెప్పిన ప్రతి హామీ నెరవేర్చుతం.. తొందరపడకండని అన్నారు.
Read more:Hyderabad:జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం