Hyderabad:జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం

Telangana RTC

Hyderabad:జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం:అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెర లేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి రాకేష్. మెటా ఫౌండ్ అనే ఆన్ లైన్ సంస్థ లో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు.

జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం
లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రెండు వేలు ఇస్తామని మోసం
జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు

జగిత్యాల
అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెర లేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి రాకేష్. మెటా ఫౌండ్ అనే ఆన్ లైన్ సంస్థ లో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు. నిజమేనని భావించిన అమాయక ప్రజలు వందలాది మంది లక్షలాది రూపాయలు ఆన్ లైన్ లో పెట్టుబడి పెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లా వ్యాప్తంగా 1200 మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కొడిమ్యాల కు చెందిన పది మంది 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. రోజులు నెలలు గడిచిన లాభం మాట దేవుడెరుగు అసలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మోస పోయామని భావిస్తు రాకేష్ ఇంటికి చేరి ఆందోళనకు దిగారు. రాకేష్ భార్య డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాకేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులను స్టేషన్ కు తరలించి విచారించగా ఆన్ లైన్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నయా మోసం పై ఆరా తీస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతోంది

హైదరాబాద్, మార్చి 13
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా సజ్జనార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారని ఆయనకు పేరు ఉంది. సజ్జనార్ గతంలో వరంగల్ ఎస్పీగా పని చేసినప్పుడు ఇద్దరు అమ్మాయిల మీద ఓ దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. ఇక వెటర్నరీ డాక్టర్ పై జరిగిన సామూహిక హత్యాచారం గతంలోనూ సజ్జనార్ కీలక చర్యలు తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు సజ్జనార్ ను తెలంగాణ ప్రజలకు దగ్గర చేశాయి. విధి నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా ఉంటారు.. అవినీతికి తావు ఇవ్వరని సజ్జనార్ కు పేరుంది. కరోనా సమయంలో హైదరాబాద్ లోని ఓ కమిషనరేట్ కు సీపీ గా పనిచేస్తున్న సమయంలో సజ్జనార్ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. అవసరమైన వారికి ప్లాస్మా అందేలా చేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలకు పోలీస్ శాఖ తరపు నుంచి సహాయ సహకారాలు అందేలా చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. సజ్జనార్ కు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. ఆయనను ఆర్టీసీ ఎండిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది నుంచి సజ్జనార్ ఆర్ టి సి ఎం డి గా సేవలందిస్తున్నారు.

ఆర్టీసీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చినదే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీపై భారం భారీగా తగ్గుతున్నది. అయితే అటువంటి సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారంటూ మంగళవారం ఆర్టీసీలోని కొంతమంది ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగడం సంచలనగా మారింది.సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారంటూ ఉద్యోగులు తొమ్మిది పేజీలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించారు. అయితే దీనిపై ఆర్టీసీ వెంటనే స్పందించింది. ఆర్టీసీ లో పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు సంస్థ నిబంధనలకు వ్యవహరించారట. దీనిపై ఫిర్యాదులు రావడంతో సజ్జనార్ వేగంగా చర్యలు చేపట్టారట. ఆరోపణలు నిజమని తేలడంతో 400 మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించారట. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారు మొత్తం మంగళవారం నిరసనకు దిగారు. ఏకంగా సజ్జనార్ పై అవినీతి ఆరోపణలు చేశారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ కూడా తొలగించిన ఆ 400 మంది ఉద్యోగులకు సంబంధించిన కీలక వీడియోలను విడుదల చేసింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రంజుగా మారింది. సజ్జనార్ ఇప్పటివరకు ఎన్నో చోట్ల పని చేశారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఆడపిల్లలపై దాడులకు పాల్పడే వ్యక్తులపై సజ్జనార్ కఠినంగా వ్యవహరించారు. అటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూశారు. ఇక శాంతి భద్రతలను కాపాడే విషయంలో సజ్జనార్ ఏమాత్రం రాజీ పడేవారు కాదు. అయితే అటువంటి వ్యక్తిపై ఉద్యోగులు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి ఈ సంఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Read more:Hyderabad:ఫ్యూచర్ సిటీ పరిధిలోకి 56 గ్రామాలు

Related posts

Leave a Comment