Hyderabad:ఇంకా కోలుకోని శ్రీ తేజ:ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా.. మనస్పూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇంకా కోలుకోని శ్రీ తేజ
హైదరాబాద్, మార్చి 14
ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృష్టం కూడా ఉండాలి..! ఈ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్ లక్కీ. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా.. 1800 కోట్లు వసూలు చేసినా.. మనస్పూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన మొత్తం సినిమా యూనిట్కు షాపంగా మారింది. ఒక్క ఇన్సిడెంట్తో వాళ్ల సినిమా సక్సెస్ అంతా గాల్లో కొట్టుకుపోయింది. అంత పెద్ద హిట్ అయినా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు బన్నీ అండ్ బ్యాచ్. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది.. ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్నుంచి ఆ కుర్రాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాట జరిగి మూడు నెలలు దాటినా కూడా ఇంకా అలాగే ఉన్నాడు శ్రీతేజ్.ఈ కుర్రాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరా తీస్తున్నాడు కానీ ఏం చేస్తాం తేజ్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ కుర్రాడిలో ఉలుకు పలుకు లేదు. హాస్పిటల్ బెడ్డుపై అలాగే పడున్నాడు. ఆయన కోసం చేయని వైద్యం లేదు.. రాని వైద్యుడు లేడు.. అవసరం అయితే ఫారెన్ కూడా ఓకే అంటున్నారు బన్నీ టీం. కానీ లాభం లేకుండా పోతుంది.
కుర్రాడు కళ్లు తెరిచి చూస్తున్నా ఎవర్నీ గుర్తు పట్టట్లేదు శ్రీతేజ్. ఆకలి లేదు.. పైకి లేచి కూర్చునే పరిస్థితి లేదు.. ఈ రోజుకు కూడా ఆహారాన్ని కేవలం పైపులతోనే అందిస్తున్నారు కానీ సొంతంగా తీసుకోలేకపోతున్నాడు ఈ అబ్బాయి. ఇప్పటికీ మూడు నెలలు అయింది.. ఇంకా ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేకపోతున్నారు వైద్యులు. అసలేమైంది అని ఆరా తీస్తే చాలా సమస్యలే బయటపడుతున్నాయి. తొక్కిసలాట జరిగినప్పుడు బ్రెయిన్కు చాలా సేపు రక్త ప్రసరణ ఆగిపోవడంతోనే అసలు సమస్యలు వచ్చాయంటున్నారు డాక్టర్లు.ఆ షాక్తోనే శ్రీతేజ్ ఆరోగ్యం ఓ పట్టాన మెరుగుపడటం లేదని.. అప్పుడప్పుడూ కళ్లు తెరుస్తున్నా చలనం లేకుండానే ఉన్నాడంటున్నారు వైద్యులు. ఇది కోమా కాని కోమా అంటున్నారు వాళ్లు. ఆస్పత్రికి తరలించిన తర్వాత రక్త ప్రసరణ జరిగేలా చూసినా కూడా అప్పటికే మెదడుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు ఆ కుర్రాడు. ఉన్నారు. ఆ తర్వాత బయటికి వచ్చినా కూడా లాభం లేదు. శ్రీతేజ్ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని తపిస్తున్నారు బన్నీ టీం. అవసరమైతే విదేశీ వైద్య నిపుణుల సాయం తీసుకోవాలంటున్నారు. కావాలంటే ఫారెన్ కూడా వెళ్లండి.. మేం కూడా తోడుగా వస్తామంటున్నాడు అల్లు అర్జున్. పైగా బన్నీ వాస్ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్కు వచ్చి కుర్రాడి గురించి ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతానికైతే శ్రీతేజ్ ఇంకా అచేతనంగానే ఉన్నాడు.. త్వరలోనే ఆ అబ్బాయి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం..!
రేవంత్ సీరియస్ కు కారణం ఏమిటీ
తెలంగాణ కాంగ్రెస్లో నేతల తీరే వేరు. సీఎం రేవంత్ వ్యవహారం వేరు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనుక ఏదో ఉంటుందని హస్తం పార్టీలోనే చర్చ ఉంటుంది. ఇప్పుడు సీఎల్పీ భేటీలో సీఎం చేసిన కామెంట్స్పై కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి డిస్కషనే జరుగుతోందట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో మీటింగ్లో ఉన్నవారంతా అవాక్కయ్యారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే పట్టనట్లుగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ప్రతిపక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడమేంటంటూ నిలదీశారట. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై పోటీ పెట్టరని భావిస్తున్నారా..? అంటూ గుస్సా అయ్యారట. ఆల్ ఆఫ్ సడన్గా సీఎం ఈ స్థాయిలో కామెంట్స్ చేసేసరికి.. సీఎల్పీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారట.ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్వయంగా కేసీఆర్ దగ్గరకి వెళ్లి మరీ కుశల ప్రశ్నలు వేశారట. పనిలో పనిగా కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారట. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా విడిగా కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారట.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాలని కేసీఆర్కు ఇన్విటేషన్ ఇచ్చారు. సభలో కేసీఆర్తో ఎమ్మెల్యేలు, మంత్రులు మర్యాదపూర్వకంగా మాట్లాడటం చూసిన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్తో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించకుండా ఇన్డైరెక్టుగా వరుస పెట్టి గుంపులో గోవిందం అన్నట్లుగా అందరికీ చురకలంటించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రవీంద్ర భారతిలో జాబ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ఫ్రస్టేషన్లో భాగమేనంటోంది బీఆర్ఎస్.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా… మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట. హస్తం గూటికి చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఈ మధ్య రివర్స్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే కోనప్ప లాంటి వాళ్లు సైతం బహిరంగంగానే కాంగ్రెస్ ను విమర్శిస్తూ… కేసీఆర్ను పొగుడుతుండటం లాంటి పరిస్థితులు కూడా సీఎంకు చికాకు తెప్పిస్తున్నాయట.మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సైతం నేతలెవరూ సరిగ్గా తిప్పికొట్టకుండా… ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కూడా సీఎం రేవంత్కు చిరాకు తెప్పించిదంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ను పలకరించడం కూడా ఆయనకు పుండు మీద కారం చల్లినట్లు అయిందట. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలందరినీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారట రేవంత్.సీఎల్పీ మీటింగ్లో సీఎం చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తుంటే.. కేసీఆర్ స్ట్రేచర్ను చూసి రేవంత్ ఫ్రస్టేట్ అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలా పార్టీ ఎల్పీ మీటింగ్లో రేవంత్ చేసిన కామెంట్స్ అటు కాంగ్రెస్లో..ఇటు అపోజిషన్ బీఆర్ఎస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read more:Gandhinagar:పడిపోతున్న పులులు, సింహాలు