Byreddy Siddharth Reddy | బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి…గాయబ్ | Eeroju news

బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి...గాయబ్

బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి…గాయబ్ కర్నూలు, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Byreddy Siddharth Reddy వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు, నామినేటెడ్ పదవులలో ఉన్న నాయకులు ఇష్టారీతిన వ్యవహరించారు. అలాంటి జాబితాలో మాజీ మంత్రులు ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా ఇలా చెప్పుకుంటూ వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా కు చెందిన మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తమదైన స్టైల్‌లో నోరు పారేసుకున్నారు. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్‌ లేకుండా పోవడం హాట్‌టాపిక్‌గా మారింది. నందికొట్కూరు నియోజకవర్గ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కనపడుట లేదని అని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నా అతని అడ్రస్ దొరకడం లేదంట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని…

Read More

Jagan and Sajjala | జగన్ ను ఇరికిస్తున్న సజ్జల | Eeroju news

జగన్ ను ఇరికిస్తున్న సజ్జల

జగన్ ను ఇరికిస్తున్న సజ్జల విజయవాడ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Jagan and Sajjala ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం కోల్పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయంట. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అప్పట్లో ఏపీలో రెండు ప్రధాన రాజకీయ దాడులు, సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాటిలో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది . ఆ క్రమంలో ఆయన సన్నిహితుల దగ్గర తన బాధలు చెప్పుకుంటూ తెగ బాధ పడిపోతున్నారంట. ఏపీలో రెండు ప్రధాన రాజకీయ దాడులు, సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ…

Read More

Visakhapatnam | విశాఖపట్నానికే ప్రాజెక్టు 77 | Eeroju news

విశాఖపట్నానికే ప్రాజెక్టు 77

విశాఖపట్నానికే ప్రాజెక్టు 77 విశాఖపట్టణం, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Visakhapatnam ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అటు టీసీఎస్ సైతం విశాఖపట్నానికి తరలిరానున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు విశాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పాటుగా 31 ఆయుధాలతో కూడిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.…

Read More

Tirupati | తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ | Eeroju news

తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ

తిరుపతిలోనే స్కిల్ యూనివర్శిటీ తిరుపతి, అక్టోబరు చ17, (న్యూస్ పల్స్) Tirupati ఆంధ్రప్రదేశ్ యువత కోసం చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ వర్శిటీనీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే కసరత్తు చేస్తోంది. అయితే స్కిల్ యూనివర్శిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి జల్లా ఏర్పేడు మండలం కొబాక దగ్గర 50 ఎకరాల స్థలంలో వర్శిటీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఈ యూనివర్శిటీకి వర్సిటీకి ఛైర్మన్‌గా వ్యాపారవేత్తలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారట. గత ప్రభుత్వం స్కిల్ వర్సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించింది.. కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదు. అందుకే ఏర్పేడు దగ్గర భూములు అందుబాటులో ఉండటంతో.. అక్కడ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ నిర్ణయించినట్ల తెలుస్తోంది. ఈ స్కిల్ వర్శిటీకి…

Read More

Amaravati Capital | రాజధాని ఆర్కిటెక్ట్ ల ఖరారుకు బిడ్లు | Eeroju news

రాజధాని ఆర్కిటెక్ట్ ల ఖరారుకు బిడ్లు

రాజధాని ఆర్కిటెక్ట్ ల ఖరారుకు బిడ్లు విజయవాడ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Amaravati Capital ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు స్పీడందుకున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తైంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయాల ఆకృతులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.2014లో అధికారం చేపట్టిన టీడీపీ…అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం రాజధానిలో ప్రభుత్వ, అధికారుల భవనాలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ఐకానిక్‌ భవనాలకు డిజైన్లను 2018లో లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, అధికారుల కార్యాలయ భవనాల డిజైన్లు మార్చకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లనే కొనసాగించేలా…

Read More

Balineni Srinivasa Reddy | బాలినేని ఒంటరైపోయారా… | Eeroju news

బాలినేని ఒంటరైపోయారా...

బాలినేని ఒంటరైపోయారా… ఒంగోలు, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Balineni Srinivasa Reddy అన్న తోప్‌ దమ్ముంటే ఆపు. బాలినేని అంటే ఓ బ్రాండ్. తాను చేరుతానంటూ ఏ పార్టీ అయినా గంతులేస్తుంది. వైసీపీలో ఉన్నప్పుడు ఆ మాజీమంత్రి చెప్పుకునే తీరు ఇలాగే ఉండేది. సరే వైసీపీకి పవర్‌ పోయింది. సార్‌ ఇక ఫ్యాన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. గ్లాస్‌ పట్టుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా రగిలిపోతున్న రాజకీయాల మధ్యే జరిగింది. సరే వెళ్లాక అంతా సెట్‌ అవుతుందనుకున్నారు. కానీ ఎంట్రీకి ముందున్నదానికంటే.. ఎంట్రీ ఇచ్చాకే అసలు సీన్‌ కనిపిస్తుందట. ఇప్పుడు ఎగ్జిట్‌ అవలేం..అలా అని గ్లాస్‌ పట్టుకుని టీ తాగలేం అన్నట్లుగా మారిపోయిందట ఆయన పరిస్థితి. వెళ్లామా..కండువా కప్పుకున్నామా..పార్టీలో చేరామా అని సోసో అన్నట్లుగా కథ నడిపిస్తున్నారట. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. విచిత్రపరమైన రాజకీయ పరిస్థితులను…

Read More

AP Liquor Prices | ఏపీలో లిక్కర్ ధరలు | Eeroju news

ఏపీలో లిక్కర్ ధరలు

ఏపీలో లిక్కర్ ధరలు విజయవాడ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) AP Liquor Prices ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్లుగానే.. కూటమి సర్కార్ పాత మద్యం పాలసీని రద్దు చేసి.. కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ షాపులు దక్కించుకునేందుకు ఓ రేంజ్‌లో అప్లికేషన్స్ వచ్చాయి. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు కూడా జరిగింది. బుధవారం నుంచి కొత్త షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రతి మద్యం దుకాణంలోనూ ప్రీమియం బ్యాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో కొత్త మద్యం ధరలపై తాజాగా స్పష్టత వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ విస్కీ క్వార్టర్ రూ.230, 8 PM విస్కీ క్వార్టర్ రూ.230, ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ క్వార్టర్ రూ.150, Mc Dowwels No1 విస్కీ క్వార్టర్ క్వార్టర్ రూ.180, హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎం.ఎల్ రూ. 130 ఉంది. ఇదే…

Read More

AP Cabinet | ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం | Eeroju news

ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం

ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) AP Cabinet ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కేబినెట్‌ ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కొత్త పాలసీలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఏపీ క్లీన్‌ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని రూపొందించింది. ఇవే కాకుండా ఏపీ…

Read More

Jana Sena | మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం | Eeroju news

మోడీ ఫోటో ఎక్కడా... జనసేనాని ఆగ్రహం

మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం కాకినాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Jana Sena ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ తన ‘ x ” హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన…

Read More

Elephants Hulchul in Chittoor Dist | చిత్తూరులో గజరాజుల బీభత్సం.. | Eeroju news

చిత్తూరులో గజరాజుల బీభత్సం..

చిత్తూరులో గజరాజుల బీభత్సం.. తిరుపతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Elephants Hulchul in Chittoor Dist ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య రోజు రోజుకు తీవ్రతరం అయ్యింది. రైతులకే కాదు ఏనుగుల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాదు రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.అడవిని వదిలి గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగు గుంపు పీలేరులో మరో రైతును పొట్టన పెట్టుకుంది. గజరాజులు చిత్తూరు జిల్లా రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఏనుగుల సమస్య రైతాంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. పంట పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపెడుతున్నారు. శేషాచలం అడవులు, కౌండిన్య అభయారణ్యంతో పాటు చిత్తూరు జిల్లాకు ఇరువైపులా ఉన్న తమిళనాడు కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి.…

Read More