నోటపై రానీ ఏకాభిప్రాయం… హైదరాబాద్ ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) రానున్న పంచాయతీ ఎన్నిక ల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేకుండా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది, ఒకే నామినేషన్ వేస్తే ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పరిగణించి ఓటింగ్ పెట్టాలని యోచిస్తోంది.ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పాదనలపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.మళ్లీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొన్నది. ఒకే…
Read MoreAuthor: Admin
Telangana Reservations : హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్
హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ కారణాలుగా చెప్పవచ్చు. తమ వర్గాల జనాభా లెక్కల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కోరిన మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇటీవల సర్వే గణాంకాలను వెల్లడించింది.ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం… తెలంగాణలో బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31% ఉన్నారు. ఏక సభ్య ఎస్సీ కమిషన్ ప్రకారం… ఎస్సీల్లోని 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ సర్వే లెక్కలు తప్పంటూ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కొట్టిపారేస్తున్నాయి.ఎస్సీ, ఎస్టీలకు 27% రిజర్వేషన్లు పోగా…మిగిలిన…
Read MoreTelangana Politics : ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్
ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్ హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) తెలంగాణ పాలిటిక్స్ మాత్రం ప్రతీరోజు క్లైమాక్స్ను తలపిస్తున్నాయి. రేపోమాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి పార్టీలు.బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తున్నారు. గులాబీ నేతలు అయితే రేవంత్ సీటుకే ఎసరు వచ్చిందని..బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయ్యే పని కాదని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కొనసాగుతోన్న రాజకీయం ఆసక్తికరంగా మారింది.ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయినప్పటి నుంచి..లేటెస్ట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం వరకు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్నాయి. కారు పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన పది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఉండనే ఉంది.ఇలాంటి సమయంలో కాంగ్రెస్,…
Read MoreBJP : కమలంలో కొత్త కయ్యం…
కమలంలో కొత్త కయ్యం… హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్0 తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం రచ్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు 23 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే పలు జిల్లా అధ్యక్షుల ఎంపిక పార్టీలో అసంతృప్తులకు దారి తీస్తోంది. తాము సూచించినవారికి కాకుండా మరో నేతకు అవకాశం ఇచ్చి..తమకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్పిన వారికి కాకుండా వేరే వారికి ఎలా బాధ్యతలు కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు నేతలు.పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా..ఎవరికి పడితే వారికి జిల్లా అధ్యక్ష పోస్ట్ ఇచ్చారని గరం గరం అవుతున్నారు పలువురు నేతలు. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినవారికి మాత్రమే మండల, జిల్లా అధ్యక్ష పదవులు…
Read MoreBird Flu : నిండా మునిగిన పౌల్టీ ఇండస్ట్రీ
నిండా మునిగిన పౌల్టీ ఇండస్ట్రీ ఏలూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. వదంతులు వ్యాపించడంతో ధరలు పడిపోయాయి.ఏపీలో కోళ్ల పరిశ్రమకు అనువైన సీజన్లో వైరస్ బారిన పడి లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. వదంతుల్ని కట్టడి చేయడంలో పశు సంవర్థక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వ్యాధి నిర్ధారణ తర్వాత చేపట్టాల్సిన చర్యల విషయంలో తీరిగ్గా వ్యవహరించడంతో భారీగా డామేజ్ జరిగింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో అనుమానాలు తీర్చడంలో ఏపీ పశు సంవర్థకశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాంసం,…
Read MoreAnchor Shyamala : శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా
శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా నెల్లూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) బ్రహ్మ ఆనందం సినిమా రిలీజ్ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా పలు కామెంట్స్ చేశారు. తన ఇంటిలో తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ అనే ఫీలింగ్ వస్తుందని మెగాస్టార్ అన్నారు. తమ వారసత్వాన్ని కొనసాగించేందుకు వారసుడిని ఇవ్వాలని, రామ్ చరణ్ కు చెప్పినట్లు తన మదిలో మాట సరదాగా మెగాస్టార్ చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త వివాదంగా మారాయి. మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. కుమారులే వారాసులవుతారా? కుమార్తెలు వారసులు కారా అంటూ శ్యామల ప్రశ్నించారు. అంతటితో ఆగక, కోడలు ఉపాసన అన్ని రంగాలలో రాణిస్తూ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేదా అంటూ శ్యామల ప్రశ్నించారు. శ్యామల కామెంట్స్ ని బట్టి కుమార్తెలు కూడా వారసులవుతారని ఆమె అభిప్రాయం.…
Read MorePawan Kalyan : పవన్ కోసం బీజేపీ సైన్యం
పవన్ కోసం బీజేపీ సైన్యం తిరుపతి, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) కేరళ నుంచి తమిళనాడుకు వెళ్లిన పవన్ కల్యాణ్ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. మొదట స్వామిమలై శ్రీ స్వామినాథస్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత కుంభకోణంలోని ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రపీఠేశ్వరి అమ్మవారికి అర్చనలు చేశారు. శ్రీ అగస్త్య కుంభముని ధ్యాన పీఠాన్ని సందర్శించారు. కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉంది. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆదివినాయగర్ ని మొదట పూజిచారు. ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాంఢం ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను పవన్ కళ్యాణ్ కి అర్చకులు వివరించారు. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరు. అందుకే విశిష్ట…
Read MoreJagan Mohan Reddy : కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం
కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న – భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు. అందర్నీ కలుస్తానని వివరించారు. జగన్ చెప్పిన తీరుతో కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల…
Read MoreGold Mining : కర్నూలులో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్
కర్నూలులో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కర్నూలు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో ఈ బంగారం మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ ప్లాంట్ కోసం జియోమైసూర్ అండ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ రెండేళ్ల నుంచి పైలెట్ ప్రాజెక్టు పనులు చేపట్టాయి. ఎట్టకేలకు త్వరలోనే ఈ ప్లాంట్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇక జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పర్యావరణ అనుమతులు లభిస్తే.. మూడు నెలల్లోగా ఈ ప్లాంట్ నుంచి బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా…
Read MoreVijayawada Metro : బెజవాడలో మెట్రో అడుగులు
బెజవాడలో మెట్రో అడుగులు విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి భూమిని సేకరించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్అధికారులు మరోసారి భూసేకరణ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దాదాపు 90 ఎకరాల భూమి అవసరమని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంబందించి ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పీఎన్ బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్ బీఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు.మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమనే…
Read More