Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు:రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం,లీజుల ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భవన నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. .ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు
విజయవాడ, మార్చి 12
రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం,లీజుల ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భవన నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. .ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. బహుళ పక్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా అమరావతికి నిధుల సేకరిస్తున్నామని చెప్పారు. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద నమ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని..ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిగా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసారని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం,లీజుల ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు,భవన నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. .ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. బహుళ పక్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా అమరావతికి నిధుల సేకరిస్తున్నామని చెప్పారు. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద నమ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని..ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిగా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసారని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రపంచ బ్యాంకు,ఏడీబీ కలిసి 13,400 కోట్లు రుణం ఇస్తున్నాయని చెప్పారు. KFW బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుందని, హడ్కో నుంచి 11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందని చెప్పారు.కేంద్రం గ్రాంట్ కింద మరో 1560 కోట్లు ఇస్తుందని అమరావతి లోపల భూములు అమ్మడం,లీజు ద్వారా అలాగే జాతీయ,అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవడం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు.అమరావతిలో 106 ప్రభుత్వ,ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లు ఇచ్చేందుకు అథారిటీ అనుమతి తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.అమరావతిలో ట్రంక్ రోడ్లు(మెయిన్ రోడ్లు) 165 అడుగులు,185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తామని సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో…మిగతావి రెండేళ్లు,అసెంబ్లీ,సెక్రటేరియట్,హైకోర్టు నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
2014-19 మధ్యలో అమరావతిలో 131 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించగా….గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు.గతంలో కేటాయించిన మొత్తం 31 సంస్థలకు 629.3 ఎకరాలు కొనసాగిస్తుండగా, రెండు సంస్థలకు 5.5 ఎకరాలు వేరొక ప్రాంతాల్లో కేటాయిస్తున్నామన్నారు.మరో 16 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయడంతో పాటు వేరొక చోట 48.74 ఎకరాలు కేటాయించామన్నారు.మరోవైపు 13 సంస్థలకు 177.24 ఎకరాలు గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా 683.6 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయిస్తూ ఈనెల 10న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ గారు ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ప్రభుత్వం మారగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని చేయలేదన్నారు.గత ఐదేళ్లలో రాజధాని కి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారని శాడిజంతో కక్ష సాధింపుతో ఆర్ – 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు.వేరొక చోట స్థలం కేటాయించి అమరావతి భూములను రాజధాని కోసం తీసుకుంటామన్నారు.
Read more:Warangal:నిండా ముంచుతున్న మొక్కజొన్న