Andhra Pradesh:జగన్ ఎందుకిలా

Budget of Andhra Pradesh

Andhra Pradesh:జగన్ ఎందుకిలా:వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ఖచ్చితంగా చెబుతున్నారు. ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు అయ్యే ఛాన్స్ లేదు. గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా గెలిచిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా తాము సభకు వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించాలని ఉంటుంది. జగన్ హుకుం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.

జగన్ ఎందుకిలా..

విజయవాడ, ఫిబ్రవరి 25
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ఖచ్చితంగా చెబుతున్నారు. ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు అయ్యే ఛాన్స్ లేదు. గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా గెలిచిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా తాము సభకు వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించాలని ఉంటుంది. జగన్ హుకుం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేతగా ఆయన సభకు దూరంగా ఉండవచ్చు. అంతే తప్ప మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలను ఆపే హక్కు ఎక్కడిది అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే నెంబరు వల్లనే తాము ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ దానిని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్లాలి. అవమానాలు భరించాలి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దాదాపు మూడున్నరేళ్ల పాటు సభకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవమానాలు భరించాలని, అప్పుడే మరింత సానుభూతి పెరుగుతుందని చెబుతున్నప్పటికీ జగన్ తన చెవులకు ఎక్కించుకోవడం లేదని వైసీపీ నేతలే చెబుతున్నారు.

అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసనమండలి విషయంలో మాత్రం అలాంటి షరతులు ఉంచలేదు. అక్కడ తమ పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీలు సభకు హాజరవుతున్నారు. అవమానకరమైన మాటలు వినాల్సి వస్తుంది. సెటైర్లు చెవిన పడతాయి. జగన్ కు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. అదే సమయంలో అధికార పార్టీపై కూడా విమర్శలు చేయవచ్చు. అంతే తప్ప తనకు అధికారం ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని మొండికేస్తే ఎవరికి నష్టం అని నిలదీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లినా సభలో వేసే ప్రశ్నలు రికార్డవుతాయి. అవి పదికాలం పాటు గుర్తిండిపోతాయి. సభకు వెళ్లినంత మాత్రాన జగన్ గౌరవానికి భంగం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నించినా వారిని ప్రజలు చీత్కరించుకుంటారు. గత శాసనసభలో అలా వ్యవహరించిన వారిని ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందులోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలున్నాయి. వీటిపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా జగన్ చేజార్చుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. బయట ఎంత మొత్తుకున్నా, మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేసినా ఫలితం లేదు. ప్రజా సమస్యలకు రెస్పాన్స్ రావాలంటే సభకు వెళ్లాలని పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. బెంగళూరులో కూర్చుని శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలను చూస్తారేమో. మరి జగన్ ఇకనైనా ఆలోచనను మార్చుకుని సభకు రావాలని వైసీపీ క్యాడర్ కూడా కోరుతుంది.
మండలి సెంట్రిక్ గా రాజకీ్యం
సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈరోజు సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చారు. అప్పటికే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని సైతం బహిష్కరించి బయటికి వచ్చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు సభలో అడుగు పెట్టమని తెలిసి చెప్పారు. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా భావించారు. దానిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన లేదని.. అందుకే శాశ్వతంగా శాసనసభ సమావేశాలను బహిష్కరిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 2029 ఎన్నికల వరకు బయట జనాల్లో సమస్యలపై పోరాటం చేద్దామని చెప్పుకొచ్చారు.అయితే శాసనమండలిలో వైసిపి సభ్యులు హాజరవుతారని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శాసనసభకు వచ్చారు జగన్. పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో సభకు హాజరు కాలేదు. ఈరోజు మాత్రం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరవుతారని అంతా భావించారు.

అందరూ భావించినట్టే జగన్ శాసనసభ సమావేశాలకు వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఇకనుంచి ఎమ్మెల్యేలు ఎవరు శాసనసభ సమావేశాలకు హాజరు కారని.. ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలి సమావేశాలకు హాజరవుతారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ 30 మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలిలో ఆ పార్టీ దే ఎక్కువ బలం. వాస్తవానికి 45 మంది వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉండేవారు. ఎన్నికల కు ముందు ఓ నలుగురు పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ఆరేడుగురు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉండడంతో ఆయన ఈ రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉండడంతో దానిని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలని జగన్ భావిస్తున్నారు.బొత్స సారధ్యంలో.. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. మండలిలో ఆయనకు విపక్ష నేత హోదా ఉంది. అది క్యాబినెట్ తో సమానం. మరోవైపు శాసనమండలి చైర్మన్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. దీంతో శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బొత్స నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి అయితే తాను తప్పుకొని ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించారు. బయట ఉండి ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని.. కానీ మండలి వేదికగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధం చేసే బాధ్యతను బొత్సకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి.

Read more:Andhra Pradesh:మార్చి నెల టెన్షన్

Related posts

Leave a Comment