Telangana | బఫర్ జోన్లు.. ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే | Eeroju news

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే

హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్)

Telangana

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెరువులు, జలాశయాల FTL, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చాలని.. సర్వే పూర్తి చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో HMDA పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ సెక్రటేరియట్ లో సోమవారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి 2014 వరకే 225 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యా్యి. మరో 196 చెరువుల భూములు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయి. 499 చెరువులలో ఎలాంటి కబ్జాలు, ఆక్రమణలు జరగలేదని అధికారులు తెలిపారు. గత పదేళ్లలో 2014 నుంచి 2023 వరకు మరో 20 చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జా చేశారు. గతంలో పాక్షికంగా ఆక్రమణలకు గురైన మరో 24 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మరో 127 చెరువుల భూముల్ని వీలైనంత వరకు ఆక్రమించుకున్నారని శాటిలైట్ ఇమేజ్ లు చూపించి వివరించారు. ఇలా జరగడం హైదరాబాద్ కు, నగర ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీని వల్ల నీటి లభ్యత తగ్గుతుంది, భారీ వర్షాలు, వరదలతో నగర ప్రజలకు సమస్యలు తప్పవని హెచ్చరించారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లోని కుంట్లూరులో 2014లో ఉన్న చెరువును పూర్తిగా కబ్జా చేయడాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఫొటోలు, వివరాలతో చూపించారు. ఇవన్నీ గమనిస్తే పూర్తి వివరాలతో హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కూల్చివేతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.2014లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో ఉన్న చెరువు 2023కు వచ్చే సరికి జరిగిన ఆక్రమణను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్ లో చెరువు, కుంట ను పదేళ్లలో ఎలా ఆక్రమించారో శాటిలైట్ ఇమేజ్ ను చూపించి వివరించారు. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ మేరకు కబ్జాలు, ఆక్రమణలు జరిగాయో శాటిలైట్ ఇమేజ్ లతో హైదరాబాద్ ప్రజలకు భట్టి విక్రమార్క వివరించారు. ప్రజల ఆస్తి ఏ విధంగా కబ్జా జరిగింది, ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటల భూముల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది.

చెరువులు రేవంత్ రెడ్డివి కావు, నావి కూడా కావు.. ప్రజల ఆస్తి ఇది. వీటిని ఏం చేయాలో ఇప్పుడు చెప్పాలని ప్రజలను భట్టి విక్రమార్క అడిగారు. ఇకనుంచైనా కబ్జాలు ఆగాలని, లేకపోతే భవిష్యత్తులో మరింతగా పెరిగి ఊహించిన నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రం తరఫున ప్రపంచ దేశాల్లో కొన్నిచోట్ల నగరం మధ్యలో ఉన్న నదులు, జలాశయాలను ఎలా కాపాడుకుంటున్నారు. వాటి ద్వారా ప్రజల జీవన విధానం ఎలా మారిందో పరిశీలించినట్లు తెలిపారు.

పార్క్, లేక్స్, సిటీ…
హైడ్రాపై, మూసీ సందరీకరణపై గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ప్రజలు, రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని అనేది తమ కాంగ్రెస్ ప్రభుత్వ అజెండా అని, తమకు వ్యక్తిగత, పార్టీ అజెండా లాంటివి లేవన్నారు. సెక్రటేరియట్ లో భట్టి విక్రమార్క హైడ్రా, మూసీ ప్రాజెక్టుపై మాట్లాడారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అన్నారు. అద్భుతమైన గుట్టులు, రుపాలతో రాక్ గార్డెన్ లా కనిపించేదన్నారు. దీనిపై పరోశోధనకారులు రీసెర్చ్ చేశారని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు, సరస్సులు ఎందరినో ఆకట్టుకున్నాయి. కానీ కాలక్రమేణా రాక్స్ కనిపించకుండా పోయాయి. పార్కులు సైతం కబ్జాలకు గురవుతున్నాయి.

‘నగర వాసులకు మంచినీటి వనరుల కోసం దశాబ్దాల కిందట అందుకు అనువైన విధంగా చెరువులు, జలాశయాలు నిర్మించారు. కానీ క్రమక్రమంగా ఆ లేక్స్ కనుమరుగు కావడం వల్ల భారీ వర్షాల సమయంలో వచ్చే వరదలతో హైదరాబాద్ ప్రజలకు ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనుకున్నాం. గత ప్రభుత్వాలు ఏదో ఓ కారణంతో మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పినా చేయలేకపోయాయి. భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా, అద్భుతంగా అందించాలన్న సంకల్పంతో చెరువులు, జలాశయాల సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నగరానికి మణిహారంగా మూసీని తీర్చిదిద్దాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా. ఇక్కడ ఎవరి అజెండాలు, పార్టీ అజెండాలు లేవు, కేవలం రాష్ట్ర అభివృద్ధి అజెండా తప్ప. కబ్జాలకు గురైన చెరువులు హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని’ భట్టి విక్రమార్క చెప్పారు.
హైదరాబాద్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రీమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ శాటిలైట్ ద్వారా హైదరాబాద్ లో చెరువులు ఎలా కబ్జాలకు గురయ్యాయి. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ లోని చెరువులు, జలాశయాలు ఎన్ని ఉన్నాయి. వాటి భూములు ఎంతమేర తగ్గిపోయాయో ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మూసీ సుందరీకరణ ఆవశ్యకతను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. మూసీ ప్రాజెక్టుకు 1.5 లక్షల కోట్లు ఖర్చు అని దుష్ప్రచారం చేస్తున్నారు. కొందరేమో ఈ ప్రాజెక్టు కోసం ఏ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అడుగుతున్నారు. చర్యలు మొదలుపెట్టగానే ప్రజలలో భయాలు రేకెత్తిస్తున్నారని, ఇది మంచి పద్దది కాదని హితవు పలికారు.
లండన్ లో థేమ్స్ నది, జపాన్ లోని ఒసాకాలో నది నగరం మధ్యలో ఉంటే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది. జపాన్ లోని సుమిద రివర్ ఎలా ఉందో స్వయంగా తాను పరిశీలించినట్లు భట్టి తెలిపారు. హైదరాబాద్ ఒడ్డున ఉన్న మూసీ నది పరిస్థితి ఎలా ఉందో వీడియోను ప్రదర్శించారు. ఇక్కడ మన వద్ద కూడా చెరువులు, జలాశయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ పనులు ప్రభుత్వం చేయాలి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టి కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే

New zones in HMDA | హెచ్ఎండీఏలో కొత్త జోన్లు | Eeroju news

 

Related posts

Leave a Comment