YS Sharmila Deeksha | దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ | Eeroju news

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ

విశాఖపట్టణం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)

YS Sharmila Deeksha

విశాఖలో షర్మిల స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా దీక్షకు దిగారు. చంద్రబాబు నలభై ఎనిమిది గంటల్లో 4200 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట కార్మికుల ను వెంటనే పనిలోకి తీసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే నిరాహారదీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిభిరంలో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీక్షా శీబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుండటం దారుణమని.. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు.

కనీసం కాంట్రాక్ట్ పనులు చేసుకోనే వీలులేకుండా చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడంతో ప్రైవేటీకరణకు సిద్దమయ్యారని ఆరోపించారు. కేంద్రానికి భూముల మీద కన్ను ఉంది.. ప్రైవేటీకరణ చేస్తే లాక్కోవచ్చుని కుట్ర చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇప్పటి వరకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదని.. కనీసం రా మెటీరియల్ కొనుక్కోనే పరిస్థితి కూడా ఉక్కు పరిశ్రమకు లేదన్నారు. పాలకుల నిర్వాకం వల్లే ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

నష్టాల సాకును చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని.. చంద్రబాబు, జగన్ ఎటువంటి భరోసాను ప్లాంట్ కార్మికులకు చేయడం లేదని ఆరోపించారు. చిత్తశుద్ధితో ఆదుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని.. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఒక మిలియన్ టన్నుల ను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉందన్నారు. జగన్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని అడిగారట అని ఆయనకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు మాటలు తప్ప చేతలు ఉండవన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు శిబిరానికి రావాలని.. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు భోరాసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మినెంట్ చేస్తున్నామని, స్టీల్ ప్లాంట్ స్పష్టమైన వైఖరిని చంద్రబాబు ప్రకటించాలన్నారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందించకపోతే నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని అవసరమైతే ఢిల్లీలో అయినా చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నుచి ఇటీవల నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు సమస్య ఉండటంతో ఉత్పత్తి సరిగ్గా జరగడం లేదు. ఈ కారణంగాభారీగా నష్టాలు వస్తున్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దీనిపై కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు మద్దతుగా నిలిచారు.

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ

Congress Party President Sharmila | షర్మిల.. లెక్కేంటీ.. | Eeroju news

Related posts

Leave a Comment