Women public representatives tied rakhi to CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. | Eeroju news

Women public representatives tied rakhi to CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు..

హైదరాబాద్

Women public representatives tied rakhi to CM Revanth Reddy

రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు. సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరి యాలని. మనసారా కోరుకుంటున్నాను, అని రేవంత్ రెడ్డి అన్నారు.

Women public representatives tied rakhi to CM Revanth Reddy

 

CM Revanth Reddy | రేవంత్ కు అరుదైన గౌరవం… | Eeroju news

Related posts

Leave a Comment