Andhra Pradesh:హోళి నుంచి అమరావతి పనులు

amaravathi works starts from holi

Andhra Pradesh:హోళి నుంచి అమరావతి పనులు:అమరావతి రాజధానినిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం. పనుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసింది. ఈనెల 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఖచ్చితమైన ముహూర్తాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.

హోళి నుంచి అమరావతి పనులు

అమరావతి, మార్చి 10
అమరావతి రాజధానినిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం. పనుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసింది. ఈనెల 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఖచ్చితమైన ముహూర్తాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. అన్ని విధాలా అమరావతి రాజధానిని అందుబాటులోకి తేవాలన్నది సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో కదలిక వచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని ఎంపిక జరిగింది. అందరి ఆమోదంతో ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది.

అయితే మూడు రాజధానుల నిర్మాణం పూర్తి చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకుంది.కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. మరోవైపు వివిధ సంస్థల ద్వారా పెట్టుబడి సేకరణ కూడా జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయలు సమీకరించింది కూటమి ప్రభుత్వం. మరోవైపు వివిధ సంస్థలు సైతం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం.. ఇంకోవైపు ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. గత అనుభవాల దృష్ట్యా 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని బలమైన సంకల్పంతో ముందుకు అడుగు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.2029 లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం. తద్వారా రాజధాని నిర్మాణం పూర్తి చేశామని.. తమను ఆశీర్వదించాలని ప్రజల వద్దకు వెళ్లేందుకు కూటమి ఆలోచనగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. తమ సొంత శాఖ కంటే రాజధాని నిర్మాణానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు.
2029 కోసం ప్రణాళిక…
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే అది బిజెపి, జనసేన లతో స్ట్రాంగ్ బంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ జపం పఠిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చంద్రబాబు ఎక్కువగా సేఫ్ జోన్ చూస్తుంటారు. సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఎన్నికల సమయంలో లాభనష్టాలు బేరీజు వేసుకొని అడుగులు వేస్తుంటారు. అందుకే 2024లో హిట్ అయిన కాంబినేషన్ కొనసాగాలని కోరుకుంటున్నారు. మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ కావడంతోనే చంద్రబాబు.. 2029 లోను ఇదే రిపీట్ చేయాలని భావిస్తున్నారు.2018లో ఎన్డీఏనుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారు. మోడీ ఆగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు. గత ఐదేళ్లలో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. అందుకే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ప్రధాని మోదీని అనుసరిస్తున్నారు. వాస్తవానికి మోడీ చంద్రబాబు కంటే జూనియర్. ఈ విషయాన్ని చంద్రబాబు చాలా సార్లు చెప్పుకొచ్చారు కూడా.

అయితే ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ సంక్లిష్ట పరిస్థితి దృష్ట్యా కేంద్రంతో ముందుకెళ్లాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విషయంలో కూడా చంద్రబాబు ప్రశ్నించడం లేదు. వీలైనంతవరకు విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు. హిందీని రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండడం పై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో నోరు మెదపడం లేదు.ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఎన్నడూ చూపని రాజకీయ ఉదారత చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో పెట్టించారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఒక రకమైన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ను ప్రాధాన్యం ఇస్తే సరిపోతుందా.. తమ పరిస్థితి ఏంటని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇస్తే.. ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. ఇంకోవైపు బిజెపి సైతం తమకు మరో మంత్రి పదవి కావాలని కోరుకుంటుంది. అయితే చంద్రబాబుకు ఇవేవీ కనిపించడం లేదు.. ఇవేవీ వినిపించడం లేదు. ఆయన దృష్టి అంత 2029 ఎన్నికలపైనే ఉంది.

Read more:Amaravati:మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి సీఎం చంద్రబాబు

 

Related posts

Leave a Comment