Hyderabad:ట్రాఫిక్ సమస్యలకు చెల్లు చీటి

The state government has taken a key decision to reduce the traffic problem in the city of Hyderabad

Hyderabad:ట్రాఫిక్ సమస్యలకు చెల్లు చీటి:హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయిచింది. ఈ అభివృద్ధి పనులను మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా విభజించింది.

ట్రాఫిక్ సమస్యలకు చెల్లు చీటి

హైదరాబాద్, ఫిబ్రవరి
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయిచింది. ఈ అభివృద్ధి పనులను మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా విభజించింది. హెచ్‌-సిటీ ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను అధికమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టింది. గత కొన్ని నెలలుగా నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై రేవంత్ రెడ్డి సర్కా్ర్ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌ల నిర్మించాలని ఆదేశించారు. హెచ్-సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా వీటిని నిర్మించనున్నారుఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఈ నెల 27 నుంచి మార్చి 24 వరకు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

టెండర్ దాఖలు చేసిన వారి కోసం మార్చి 10న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రి-బిడ్ సమావేసం నిర్వహించనున్నారు. మార్చి 26వ తేదీన బిడ్ ప్రైజ్ ఓపెనింగ్ చేయనున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.కేబీఆర్ పార్క్ చుట్టూ రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో.. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి సర్కా్ర్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి.. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌ల నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి నగరవాసులకు ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే చాలా ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నా సరే.. రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా, అదే స్థాయిలో రోడ్డుపైకి వస్తున్న వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో.. ట్రాఫిక్ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. అయితే.. ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఎక్కువగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్ల గుండా వెళ్తున్నారు. అయితే.. ఈ మార్గంలో ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఫైఓవర్లు లేకపోవటంతో.. ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విషయం గమనించిన ప్రభుత్వం.. భారీ ప్రాజెక్టును చేపట్టింది.

Read more:Hyderabad:ఇక ఆన్ లైన్ లోనే సీఎంఆర్ ఎఫ్ దరఖాస్తులు

Related posts

Leave a Comment