Hyderabad:తెరపైకి ఫాల్కన్ స్కామ

Scammers have launched a massive fraud under the name of Falcon Invoice Discounting.

Hyderabad:తెరపైకి ఫాల్కన్ స్కామ:నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు.

తెరపైకి ఫాల్కన్ స్కామ

హైదరాబాద్, ఫిబ్రవరి 17
నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అమాయకులను కేటుగాళ్లు నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి స్కీమ్‌ ను తీసుకువచ్చారు. ఏజెంట్లను నియమించుకుని అమాయకులకు వల పన్నారు.చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే ఫాల్కన్ సంస్థ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి 17 వేల కోట్లు వసూలు చేసిన ఈ ఘరానా మోసం గురించి తెలిసి పోలీసులే కంగుతిన్నారు.

బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థలో పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫాల్కన్కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి ఈ వసూళ్లకు పాల్పడ్డారు.కేవలం 45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22 శాతం రిటన్స్ వస్తాయని చెప్పడంతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకూ పెట్టుబడుల పేరుతో వసూలు చేశారు కేటుగాళ్లు. అందినకాడికి దోచుకున్న తర్వాత ఈ ఏడాది జనవరి 15 క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులంతా సైబరాబాద్ పోలీసులను ఫిర్యాదు చేశారు.దీంతో సంస్థ వైస్ ప్రెసిడెండ్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. పట్టుపడిన ఇద్దరూ అమర్ దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ అనే ప్రధాన నిందితులతో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లు తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారని వెల్లడించారు. ఆ నగదును 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికే దుబాయ్కు పారిపోయారు. చైర్మన్ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్కు పారిపోయారు. ఈ ముగ్గురిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం ఈ సంస్థకు చెందిన 20 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులు ఇండియాలోనే ఉన్నారని భావిస్తున్న పోలీసులు వీరి కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఈ ఎఫ్ఐడీ సంస్థకు చెందిన బిజినెస్ హెడ్ పవన్ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఒకరు అమర్ దీప్ కుమార్, మరొకరు వి.కావ్య. మిగిలిన వాళ్లంతా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. పోలీసులు ఏ1గా అమర్ దీప్ కుమార్ పేరును, ఏ2గా కావ్య పేరును చేర్చారు. ఇన్వెస్టర్ల నుంచి ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ఎఫ్ఐడీ సంస్థ డబ్బులను కలెక్ట్ చేసింది.కనిష్టంగా 15 రోజులు.. గరిష్టంగా ఆరు నెలల కాల పరిమితి వరకూ పెట్టుబడులు పెట్టొచ్చని ఇన్వెస్టర్లను ఈ సంస్థ నమ్మించింది. కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్లకు లాభాలను చూపించింది. ఒక పెద్ద మొత్తం కాగానే కుచ్చుటోపీ పెట్టింది. ఈ కంపెనీ ఆఫీస్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉంది. జనవరి 10 నుంచి ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు డబ్బులు ఎగ్గొట్టింది

Read more:What is Meaning of I in Iphone | ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా..?

Related posts

Leave a Comment