రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం:అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి.
రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం
అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు బరువు పెరగడమనే సమస్య కారణంగా అన్నం తినడాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అన్నం బదులు ఇతర ఫైబర్ రిచ్ క్వినోవా వంటి చిరుధాన్యాలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, వాటిని ఎంత తిన్నా అన్నం తిన్నట్లుగా ఉండదు. అందుకోసం, అన్నం ఎలా తినాలి, రోజులో ఎప్పుడు తింటే మంచిదో తెలుసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం అన్నాన్ని లంచ్లో తినడం చాలా మంచిది. కారణం అన్నంలో బి విటమిన్స్ ఉండడమే. బ్లాక్ రైస్ వంటివి బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగ్గా చేస్తుంది. నిజానికీ ఈ బ్లాక్ రైస్తో చేసిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. చాలా మంది తెల్లని బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇందులో పోషకాలు, ఫైబర్లు బ్రౌన్రైస్, గ్రే రైస్లతో పోలిస్తే తక్కువ. మనం తెల్లని రైస్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో షుగర్ పెరుగుతుంది. దీని బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే అందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటిని తినడం మంచిది.
మనం తినే రైస్ మోతాదులోనే తినాలని గుర్తుంచుకోండి. మనం ఎక్కువగా తెల్లని రైస్ తసీుకుంటాం. ఇందులో కాస్తా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. బ్రౌన్రైస్, ఇతర గ్రెయిన్స్తో పోలిస్తే. కాబట్టి, జాగ్రత్త అవసరం. పైగా విటమిన్స్, ఫైబర్, మినరల్స్ కావాలనుకుంటే కచ్చితంగా బ్రౌన్రైస్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తింటే చాలా మంచిది. అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం అంత మంచిది కాదు. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ని ఈజీగా పెంచుతాయి. ఎనర్జీని తగ్గిస్తాయి. బియ్యంలోని కొన్ని గుణాల కారణంగా సరిగా తీసుకోకపోతే మన బాడీలో ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతారు. రాత్రుళ్లు అన్నం తింటే త్వరగానే జీర్ణమవుతుంది. కానీ, నిద్ర సమయంలో మీ బాడీకి పోషకాలు అందవు. పైగా రాత్రంతా ఆకలితో ఉండడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే ఆకలిగా అనిపిస్తుంది. చాలా మందికి రాత్రుళ్లు అన్నం తింటేనే త్వరగా జీర్ణమవుతుందనిపిస్తుంది. కానీ, అన్నం బదులు ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. కొద్దిగా తినగానే కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి, రైస్ బదులు చపాతీ, రోటీ తినడం మంచిది. మీకు రోటీ, అన్నం కూడా నైట్ టైమ్ వద్దనిపిస్తే సలాడ్, సూప్స్ బెస్ట్ ఆప్షన్స్. వీటి వల్ల బరువు పెరుగుతారు. మీకు అన్నమే తినాలనిపిస్తే బ్రౌన్రైస్ తీసుకోవడం మంచిది.
అన్నం శరీరానికి మేలు చేస్తుంది. కానీ, అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. రోజుకు ఒక్కసారి కంటే ఎక్కువసార్లు తినడం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. చాలా మంది ఎక్కువగా అన్నం తినడానికే ఇష్టపడతారు. బయట ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా అన్నం తినడంలో ఉన్న తృప్తి మరి ఎందులోనూ దొరకదని భావిస్తుంటారు. అన్నం సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ, అన్నం తింటే బరువు పెరుగుతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది అన్నానికి దూరంగా ఉంటారు. నిజానికి బియ్యం సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది. ఎందుకంటే అందులోని కార్బోహైడ్రేట్లు శరీర అవసరాలను తీరుస్తాయి. అన్నం ఇష్టమని మూడు పూటల అదే తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, రోజుకు ఎన్నిసార్లు అన్నం తినాలి? అన్నం ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం.. రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు అధికంగా చేరుతాయి. ఇది బరువు పెరగడం, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, అన్నానికి బదులు తృణధాన్యాలు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు వంటి ఇతర పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కాబట్టి, మీరు రోజుకు రెండుసార్లు అన్నం తినకుండా ఉండాలి.
అదనపు కార్బోహైడ్రేట్లు: అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు అధికంగా చేరుతాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. కాబట్టి, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినండి. ఇందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల: మధుమేహంతో బాధపడేవారు రోజుకు రెండుసార్లు అన్నం తినడం మానేయాలి. ఎందుకంటే ఇది త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు రెండు పూటలా అన్నం తినకూడదు. జీర్ణక్రియ ఆరోగ్యం: రోజుకు రెండుసార్లు అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.