Telangana: హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
ఎయిర్ పోర్ట్ టూ ఫోర్త్ సిటీ
మెట్రొ కనెక్టవిటీ అడుగులు
హైదరాబాద్, ఏప్రిల్ 13
హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కొత్త మెట్రో మార్గానికి సంబంధించిన డీపీఆర్ను తక్షణమే సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సూచించారు.ఫ్యూచర్ సిటీ దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విస్తరణ బాధ్యతను హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ను కేంద్రానికి సమర్పించింది.
ఈ ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారుకేవలం మెట్రోనే కాదు, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి పైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్- విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే.. హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వరకు, మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్హైచ్ఏఐకి పంపించాలని సూచించారు. భూ సేకరణలో ఏర్పడుతున్న సమస్యలపై సీఎం ఆరా తీశారు. పంటలు ఉన్న భూముల విషయంలో నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ అంగీకరించకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు తెలియజేశారు.ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
Read also:కరీంనగర్ కాంగ్రెస్ లో గందరగోళం
కరీంనగర్, ఏప్రిల్ 13
కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్తో క్యాడర్లో గందరగోళం నెలకొందట. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ ఓపెన్ సీక్రెటే అని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్దే పెత్తనం అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ఐతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.కరీంనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది.. ఐనా కరీంనగర్ కేంద్రంగా మంత్రి పొన్నం పాలిటిక్స్ నడిపిస్తున్నారు.. మరోవైపు సుడా చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఇదే లోకల్గా ఆధిపత్యపోరుకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు నరేందర్రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కకుండా పొన్నం ప్రయత్నించాడని, మంత్రి శ్రీధర్బాబు ఆశీస్సులతో సుడా చైర్మన్ సీట్లో కూర్చున్నారనేది లోకల్ సర్కిల్స్లో వినిపించే చర్చ..కరీంనగర్లో మంచి పట్టున్న మంత్రి పొన్నంకు పార్టీ అధిష్టానం నుంచి కూడా సపోర్ట్ ఉంది.. ఐతే 2023లో అధికారంలోకి వచ్చిన తరువాత సుడా చైర్మన్ విషయంలో తన మాట నెగ్గించుకున్నారు మంత్రి శ్రీధర్బాబు.. అలా ఆ సీటులోకి వచ్చి కూర్చున్న నరేందర్ రెడ్డి తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇక్కడే మంత్రి పొన్నంతో ఆయనకు ఆధిపత్య పోరు మొదలైందని తెలుస్తోంది.. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్న బియ్యం పంపిణి కార్యక్రమం చేపడితే..అదే సమయంలో ముఖ్యమైన ప్రెస్ మీట్ అంటూ కబురు పంపారట సుడా చైర్మన్.. ఇలా ఇద్దరూ ఒకే సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించడం, ఒకరి కార్యక్రమాలకు మరొకరు హజరుకాకపోవడంతో క్యాడర్లో అయోమయం మొదలైందనేది లోకల్ న్యూస్..ప్రస్తుతం ఎమ్మెల్యేగా పొన్నం హుస్నాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తుండడం, మంత్రిగా పర్యటనలు సాగిస్తున్న క్రమంలో.. ఏదైనా సమస్య వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో క్యాడర్కు నరేందర్ రెడ్డే దిక్కవుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో సుడా చైర్మన్ ను కాదనే పరిస్థితి అక్కడ లేదట..అలా అని పొన్నం ప్రభాకర్ ను దూరం పెట్టుకోలేమని వారు అంటున్నారట. అయితే క్యాడర్ నే కాదు.అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట. ఇలా ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉందట అధికారులు, క్యాడర్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా మారుతున్నాయట. మరి రాబోయే రోజుల్లో వీరిద్ధరి మధ్య ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Read more:సంక్షిప్త వార్తలు:04-12-2025