Srisailam:వారి జాడ కష్టమేనా

Mahabubnagar,

Srisailam: వారి జాడ కష్టమేనా:శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది.

వారి జాడ కష్టమేనా

మహబూబ్ నగర్, ఏప్రిల్ 14
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగిన యాభై రోజులు దాటుతున్నప్పటీకి ఇంకా మృతదేహాల ఆచూకీ లభించలేదు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. దేశంలో పేరుగాంచిన సంస్థలు రెస్య్చూ ఆపరేషన్ లో పాల్గొంటున్నా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఆరుగురి ఆచూకీ కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది. పన్నెండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ ముందడగుపడటం లేదు. దీంతో లోపల చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలు మాత్రం తమ వారి మృతదేహాలయినా దొరుకుతాయా? లేదా? అన్న అనుమానం వారిలో బయలుదేరి ఆందోళన వ్యక్తమవుతుంది.ఫిబ్రవరి 22వ తేదీన శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదం జరిగింది. అందులో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో రెండు మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకూ బయటకు తీసుకురాగలిగారు. 42 మంది ప్రాణాలతో బయటపడినా లోపల ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మార్చి 9వ తేదీన ఇంజీనిర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మార్చి 25న మరో ఇంజినీర్ మనో జ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తేగలిగారు. మిగిలిన ఆరు మృతదేహాలు మాత్రం చిక్కడం లేదు.

సహాయక బృందాలు మొత్తం మూడు షిఫ్ట్ లలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా సహాయక చర్యలు పూర్తి కాకపోవడంపై కార్మికుల బంధువులు పెదవి విరుస్తున్నారు.అయితే టీబీఎం మిషన్ శకలాల తరలింపు దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 173 మీటర్ల వరకూ శిధిలాలను తొలగించామని, మిగిలిన ఎనభ మీటర్ల దూరంలోనే మృతదేహాలు ఉండవచ్చని సహాయక బృందాలు చెబుతున్నాయి. అక్కడకు వెళ్లాలంటే టన్నెల్ పైభాగం నుంచి నీటి ఊట వస్తుండంతో చర్యలకు ఆటంకంగా మారింది. డీ1 , డీ2 పాయింట్లుగా గుర్తించిన సహాయక బృందాలు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. మట్టి, రాళ్లతో పాటు నీరు ఉబికి వస్తుండటంతో ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల మధ్య తవ్వకాలు జరపాలంటే కష్టంగా మారిందన్నది అధికారుల అభిప్రాయం. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం గత కొద్దిరోజులుగా అన్వేషణ కొనసగుతుంది. పన్నెండు సంస్థలకు చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో నిరంతరం పనిచేస్తున్నారు.

వీరికి జిల్లా యంత్రాంగంతో పాటు సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి బంధువులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ లో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులతో పాటు వివిధ రకాల ఆటంకాలు ఎదురవుతుండటంతో అడ్డంకిగా మారుతుందని సహాయక బృందాలు చెబుతున్నాయి. అనేక సమస్యలు నిత్యం ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాయి.ప్రభుత్వం ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక అధికారిగా శివశంకర్ ను నియమించింది. ఒకవైపు సహాయక బృందాలను సమన్వయం చేసుకుంటూ మరొక వైపు ప్రభుత్వంతో నిత్యం చర్చలు జరుపుతూ తగిన సూచనలు చేస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి సహాయక చర్యల్లో వేగం పెరిగినట్లు ప్రత్యేక అధికారి శివ శంకర్ తెలిపారు. ఎంత ఖర్చయినా సరే మృతదేహాలు లభ్యమయ్యేంత వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మృతదేహాలను త్వరలోనే వారికి అప్పగించేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.నిపుణుల సూచనలతోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read more:Rajahmundry:జనసేన ఖాతాలోకి నిడదవోలు మున్సిపాలిటీ

Related posts

Leave a Comment