Hyderabad:గ్లోబల్ బిజినెస్ హబ్” గా  హైదరాబాద్ “

Hyderabad as a "Global Business Hub"

Hyderabad:2030 నాటికి హైదరాబాద్ లో 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నానక్ రాంగూడలో మంగళవారం యూఎస్ కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.

గ్లోబల్ బిజినెస్ హబ్” గా  హైదరాబాద్ “

హైదరాబాద్, ఏప్రిల్ 15
2030 నాటికి హైదరాబాద్ లో 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నానక్ రాంగూడలో మంగళవారం యూఎస్ కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. .. హైదరాబాద్ “గ్లోబల్ బిజినెస్ హబ్” గా మారింది. అందుకు అనుగుణంగానే నగరంలో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెరిగింది. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ తగ్గుతుంటే గతేడాది మన దగ్గర దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదయ్యింది. గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్ లో ఆమ్జెన్, ఎలీ లిల్లీ, మారియంట్, గ్లోబల్ లాజిక్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలుండగా… 3 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏడాది వ్యవధిలో 70 కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ ను జీసీసీలకు హబ్ గా మార్చడంతో పాటు వాటిని ఇన్నోవేషన్, ఆర్అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో సేవలు అందించే గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి.. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. కొందరు కావాలనే పనిగట్టుకొని పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని… అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామన్నారు. తమ జీసీసీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 100 మంది ఐటీ, డేటా నిపుణులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని… రెండు, మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, సెక్యూరిటీ మైకెల్, కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ – అమెరికా సూర్య గుమ్మాడి తదితరులు పాల్గొన్నారు.

Read more:Hyderabad:నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

Related posts

Leave a Comment