Hyderabad:ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది.
ఓఆర్ఆర్ పరిధిలో
చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా
హైదరాబాద్, ఏప్రిల్ 12
ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ , ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్టర్ డా. ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా ముందున్న లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడానికి ఎన్ ఆర్ ఎస్ సీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం మైలురాయి లాంటిదన్నారు. 1970వ సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడెస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే హైడ్రా లక్ష్యమన్నారు.
చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, పర్యావరణ హితమైన నగరాన్ని రూపొందించడానికి ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందని ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్టర్ డా. ప్రకాష్ చౌహాన్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే.. దేశంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ పేరుగాంచుతుందని అన్నారు. హైడ్రా చర్యలతో ఇది సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం జియో ఆధారిత జియోస్పేషియల్ డేటా మద్దతు, సాంకేతిక సహకారం హైడ్రాకు అందుతుంది. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతికతను వినియోగించి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) కోసం భౌగోళిక డేటాబేస్లను సమగ్రపరిచే భౌగోళిక పోర్టల్ అభివృద్ధితో పాటు జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి ఎస్ఆర్ఎస్సీ సాంకేతిక మద్దతును హైడ్రా బృందానికి అందిస్తుంది.భువాన్ పోర్టల్లో ఉన్న టీసీయూఆర్ పరిధిలో విపత్తు నిర్వహణ, నీటి వనరుల రక్షణకు సంబంధితంగా ఉండే అన్ని వారసత్వ సమాచారాన్ని ఈ ఒప్పందం ప్రకారం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. కొత్త ‘జియోస్పేషియల్ డేటా పాలసీ – 2023’ కు అనుగుణంగా ‘భూనిధి’ పోర్టల్లో ఉన్న అన్ని చారిత్రక భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ డేటా టీసీయూఆర్ ప్రాంతాన్ని కవర్ చేసే మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.
హై-రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ మొదలైనవి ఎన్ఆర్ఎస్సీ ద్వారా హైడ్రాకు అందుతాయి. ఉపగ్రహం / వైమానిక వనరుల నుంచి సంబంధిత డేటాను తయారు చేయడం, వాటి ఏకీకరణ, ఆస్తి నిర్వహణ / పర్యవేక్షణ కు సంబంధించిన సమాచార సేకరణలో హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ నుంచి అందుతుంది.ఎన్ఆర్ఎస్సీకి చెందిన నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ (ఎన్డీఈఎం) వెబ్ పోర్టల్కు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఏరో-స్పేస్ ఆధారిత విపత్తు డేటాను ఉన్న స్థితిలోనే విజువలైజేషన్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు ఉన్న ప్రాంతంతో పాటు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి ఎన్ఆర్ఎస్సీ – హైడ్రా సంయుక్తంగా కృషి చేయనున్నాయి.
Read more:పద్మశ్రీ వనజీవి రామయ్య కన్ను మూత