Bhadradri Kothagudem:రామయ్య ఆలయంలో వసంత పక్ష ఉత్సవాలు:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి వారు పక్ష ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఉగాది నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. ఈ ఉత్సవములు మొదటిగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని , రెండోది . సప్తమి నుండి పూర్ణిమ వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు
రామయ్య ఆలయంలో వసంత పక్ష ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారామచంద్ర స్వామి వారు పక్ష ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఉగాది నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి. ఈ ఉత్సవములు మొదటిగా ఉగాది నుండి నవమి వరకు మనకు వసంత నవరాత్రులు అని , రెండోది . సప్తమి నుండి పూర్ణిమ వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అని ఈ రెండు కలిపి ఈ వసంత పక్ష ఉత్సవాలుగా ఈ భద్రాచల క్షేత్రంలో చేయడం అనేది సంప్రదాయం …
బ్రహ్మోత్సవాలలో బాగంగా గరుడ పట ఆవిష్కరణ,, అగ్నిమధానం, హోమాలు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ జరిగి ఆ గరుత్మంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం సంతానం లేని వారికి ఇస్తే గర్భదోషాలు పోతాయి అని నమ్మకం.
కళ్యాణ క్రతువులో భాగంగా శనివారం సాయింత్రం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి ఆదివారం ఉదయం సీతారామచంద్ర. స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. .
Read more:Andhra Pradesh:అనిల్ యాదవ్ గాయబ్