Hyderabad:165 లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు

Debts reach 165 lakh crores

Hyderabad:165 లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు:తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అప్పులు ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిపి ఉన్న అప్పుల్లో తెలంగాణ వాటా రూ. 1.52 లక్షల కోట్లుగా నిర్ణయించబడింది. అప్పటి నుంచి వివిధ ప్రభుత్వాలు అభివద్ధి పనులు, సంక్షేమ పథకాల కోసం అప్పులు తీసుకుంటూ వచ్చాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి సుమారు రూ. 15 లక్షల కోట్లుగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాలు సూచిస్తున్నాయి.

165 లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు

హైదరాబాద్, మార్చి 21
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అప్పులు ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిపి ఉన్న అప్పుల్లో తెలంగాణ వాటా రూ. 1.52 లక్షల కోట్లుగా నిర్ణయించబడింది. అప్పటి నుంచి వివిధ ప్రభుత్వాలు అభివద్ధి పనులు, సంక్షేమ పథకాల కోసం అప్పులు తీసుకుంటూ వచ్చాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి సుమారు రూ. 15 లక్షల కోట్లుగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, అప్పుల స్థాయి గురించి ఖచ్చితమైన సమాచారం రాష్ట్ర బడ్జెట్‌ ప్రకటనలు, కాగ్‌(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికల ద్వారా తెలుస్తుంది. 2025–26 బడ్జెట్‌లో తెలంగాణ మొత్తం వ్యయం రూ. 3,04,965 కోట్లుగా ప్రకటించబడింది. ఇందులో అప్పుల గురించి స్పష్టమైన ప్రకటన చేశారు.2026 మార్చి నాటికి తెలంగాణ అప్పులు రూ.5,04,814 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గత 15 నెలల్లో రూ. 1.52 లక్షల కోట్ల అప్పు చేసింది.తెలంగాణ అప్పుల భారం ఒక వివాదాస్పద అంశంగా ఉంది.

2014లో విభజన సమయంలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులతో ప్రారంభమైన రాష్ట్రం, 2025 మార్చి నాటికి రూ.5.04 లక్షల కోట్ల అప్పుల స్థాయికి చేరినట్లు చెబుతున్నారు. ఇందులో గత ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పులు, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం గత 15 నెలల్లో రూ. 1.52 లక్షల కోట్లు అప్పుగా తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ అప్పుల్లో ఎంత భాగం అభివద్ధికి, ఎంత సంక్షేమ పథకాలకు ఉపయోగపడిందనేది స్పష్టమైన లెక్కలు లేకుండా చర్చనీయాంశంగా ఉంది.ప్రతి నెలా రూ. 6,500 కోట్లు అప్పులు, జీతాల కోసం ఖర్చు చేయబడుతుందని, మిగిలిన రూ. 12,000 కోట్లు అభివృద్ధి మరియు ఇతర అవసరాలకు వినియోగించబడుతుందని అంచనా. అప్పులు ఎ ఈ్కలో 33–35% ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు, ఇది ఆర్థిక శాస్త్రపరంగా ఆమోదయోగ్యమైన స్థాయిలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఆదాయ వనరులు పెంచకపోతే భారంగా మారవచ్చు.2025–26 బడ్జెట్‌లో తెలంగాణ మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా ప్రకటించబడింది.

ఇందులో ఆరు గ్యారంటీలు (సంక్షేమ పథకాలు), విద్య, వైద్యం, వ్యవసాయం, మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడింది. రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి రూ. 1 ట్రిలియన్‌ (సుమారు రూ. 83 లక్షల కోట్లు) స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనికి ఐటీ, పారిశ్రామిక వద్ధి, మరియు వ్యవసాయ ఆధునీకరణ కీలకం కానున్నాయి.
అప్పుల భారం: అప్పులు పెరుగుతున్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా ఉపయోగించి ఆదాయ వనరులను పెంచడం ఒక సవాలు.
సంక్షేమం VS టఅభివృద్ధి: సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు చేస్తూ, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడకుండా సమతుల్యం చేయడం అవసరం.
ప్రాంతీయ అసమానతలు: హైదరాబాద్‌ కేంద్రీకృత ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మందగించడం ఒక సమస్య.

Read also; కేటీఆర్ పాదయాత్రకు అంతా సిద్ధం

హైదరాబాద్, మార్చి 21
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభమైంది. తెలంగాణ జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమవుతున్నారు. సూర్యపేట జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సడెన్‌గా ఇలా కార్యకర్తల వద్దకు వెళ్లాలనే నిర్ణయం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది గులాబీ పార్టీ. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్లీనరీ సభ, ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేటీఆర్ ఈ భేటీల్లో చర్చిస్తారు. దీని కోసం అన్ని జిల్లాల్లో సన్నాహక సభలు నిర్వహించనున్నారు.తెలంగాణ వ్యాప్తపర్యటన ఇప్పుడు పార్టీ వర్గాల్లోను, రాజకీయంగాను చర్చ సాగుతోంది. పార్టీకి కేటీఆర్ అండ్ హరీశ్‌రావు రెండు కళ్లు. 2018 ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు చోటు కల్పించలేదు. పార్టీలో కేటీఆర్‌కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్ హరీశ్‌కు ఏడాది తర్వాత ఆర్థికమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు.

గత శాసనసభ ఎన్నికల్లోను కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే హరీశ్‌రావు మాత్రం మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. హరీశ్‌రావును కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న వాదన హరీశ్ అభిమానులు, పార్టీ నేతలు ప్రస్తావిస్తుంటారు. గతంలో ఇలా లీడ్ తీసుకొని పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. ప్రత్యేక కార్యక్రమాలకే వెళ్లారు తప్ప ఇలా ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా టూర్ పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ మనసులో మాట చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అప్పట్లో ఇదో పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనతోనే ఈ ప్రకటన చేశారా లేక కేటీఆర్ తనకు తానుగానే కార్యాచరణ ప్రకటించారా అన్న డిస్కషన్ పార్టీ వర్గాల్లో నడిచింది. ఇప్పుడు పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. దీన్ని విజయవంతం చేసే బాధ్యతను వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అప్పగించారు. అందుకే కేటీఆర్ రాష్ట్ర టూర్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సన్నాహక సభలు నిర్వహించి పార్టీ నేతలతో మాట్లాడతారు. ఇది కేవలం సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం చేస్తున్న సన్నాహకం మాత్రమే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది ఓ రకంగా పార్టీ అంతా కేటీఆర్ కనుసన్నల్లోకి తీసుకొచ్చే ఎత్తుగడగా చెబుతున్నారు. కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటి నుంచో చర్చ నడుస్తున్నా అదే టైంలో సీనియర్ అయిన హరీశ్ పరిస్థితి ఏంటీ ఏ బాధ్యతలు అప్పగిస్తారనే మాట కూడా వినిపిస్తోంది. గులాబీ పార్టీలో సీనియర్ లీడర్లలో హరీశ్ రావు ఒకరు. పార్టీ ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరు ఉంది. కేసీఆర్ పార్టీపరంగా అప్పగించే ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో దిట్ట. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా దాన్ని చల్చార్చేది హరీశ్ రావేనని పార్టీ నేతలు చెబుతారు. అటు పార్టీ సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేస్తూ పార్టీకి అనుసంధానకర్త పాత్ర పోషిస్తారని టాక్. పార్టీలో కేటీఆర్ కన్నా హరీశ్‌రావే సీనియర్. అయితే కేటీఆర్‌కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్ హరీశ్ రావు పాత్ర మాత్రం తేల్చలేదు. మరి ఇప్పుడు గులాబీ సంబరాల సన్నాహక సభలకు కేవలం కేటీఆర్ ఒక్కరే వెళ్తారా… లేక హరీశ్ రావు కూడా జిల్లాలు పర్యటిస్తారా అన్న స్పష్టత ఇంకా లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఏప్రిల్ 27 నాటి బహిరంగ సభ నిర్వహణకు టైం లేదు. దీంతో జిల్లాల పర్యటన బాధ్యతలు హరీశ్‌రావుకు కూడా అప్పగిస్తారా అప్పగించరా అన్న ఉత్కంఠ నెలకొంది.

సాధారణంగా భారీ బహిరంగ సభలను విజయవంతం చేసే బాధ్యతలను హరీశ్ రావుకే ఎక్కువగా కేసీఆర్ అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని విజయవంతం చేసిన చరిత్ర హరీశ్ రావుకు ఉంది. ఏప్రిల్ 27వ తేదీ భారీ బహిరంగ సభ బాధ్యతలు హరీశ్ రావుకే అప్పగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి.పార్టీలో ఉద్యమం నాటి నుంచి తనకుంటూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ కవితకు అప్పగించే బాధ్యతలు ఏంటనే మరో చర్చ నలుగుతోంది. మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కవిత దూకుడుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఎస్సీ, బీసీ వర్గాల సమస్యలు, డిమాండ్లపై సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి కౌంటర్లు ఇస్తూ పార్టీని బలోపేతం చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు కూడా ఎలాంటి పార్టీ పదవి ఇవ్వలేదు. కేటీఆర్‌కు పార్టీలో లీడింగ్ పోజిషన్ ఇచ్చిన కేసీఆర్, హరీష్‌ అండ్‌ కవితకు అప్పగించే బాధ్యతలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వీరంతా కేసీఆర్ కుటుంబ సభ్యులే. అయినా ఉద్యమాలు చేశారు. రాజకీయాల్లో కూడా ప్రూవ్‌ చేసుకున్నారు. పార్టీ క్యాడర్‌పై ఈ ముగ్గురి ప్రభావం చాలా ఉంటుంది. అందుకే హరీశ్రావు, కవితకు భవిష్యత్ ఏంటని పార్టీలో వారి పాత్ర గురించే అందరూ ఎదురు చూస్తున్నారు.

Read more:Adilabad:సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు

Related posts

Leave a Comment