Andhra Pradesh:సజ్జలకు జగన్ వార్నింగ్

Jagan's warning to Sajjalas

Andhra Pradesh:సజ్జలకు జగన్ వార్నింగ్:వైసీపీ ప్రస్తుత ఉన్న పరిస్థితికి కారణం వైయస్ జగన్ తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. 2019లో 151 స్థానాలతో అత్యంత ఘనవిజయం సాధించిన పార్టీ… 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడాన్ని వైసిపి కార్యకర్తలు అసలు జీర్ణించుకోవడం లేదు. అటు వైసీపీ నేతలకు కూడా ఈ ఓటమి ఇంకా మింగుడు పడటం లేదని చెప్పాలి. 2010 నుంచి కష్టపడి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైయస్ జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు వైసీపీని బాగా ఇబ్బంది

సజ్జలకు జగన్ వార్నింగ్

విజయవాడ, మార్చి 20
వైసీపీ ప్రస్తుత ఉన్న పరిస్థితికి కారణం వైయస్ జగన్ తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. 2019లో 151 స్థానాలతో అత్యంత ఘనవిజయం సాధించిన పార్టీ… 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడాన్ని వైసిపి కార్యకర్తలు అసలు జీర్ణించుకోవడం లేదు. అటు వైసీపీ నేతలకు కూడా ఈ ఓటమి ఇంకా మింగుడు పడటం లేదని చెప్పాలి. 2010 నుంచి కష్టపడి 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైయస్ జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు వైసీపీని బాగా ఇబ్బంది పెట్టాయి.దానికి తోడు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం… పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేసిందని చెప్పాలి. ఇంకా పార్టీ నేతలను జగన్ కు దూరం చేయడం కూడా వైసిపి పతనానికి కారణమనే అభిప్రాయాలు చాలామంది నుంచి వినిపించాయి. ముఖ్యంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి… వైయస్ జగన్ కు పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ… జగన్ ను కార్యకర్తలకు, పార్టీ నాయకులకు దూరం చేశారనే అభిప్రాయాలు అప్పట్లో చాలా వరకు వైసిపి నేతల నుంచే వినిపించాయి.ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేయాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో. ఇక వైసిపి సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కున్నారు.

వైసీపీలో రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి పెత్తనమే ఎక్కువగా కనపడింది. దీనితో విజయసాయిరెడ్డి విసిగిపోయి జగన్ కు దూరమయ్యారు. సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అదే. ఈ విషయాన్ని స్వయంగా విజయ సాయి రెడ్డి వెల్లడించారు.అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైయస్ జగన్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు రామకృష్ణారెడ్డిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారట. పార్టీ నేతలతో కూడా ఎటువంటి సమావేశాలు నిర్వహించొద్దని… పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉండవద్దని సజ్జల రామకృష్ణారెడ్డికి… జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. గతంలో ఆయన సాక్షిలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సాక్షికి పరిమితం కావాలని జగన్ చెప్పినట్లు సమాచారం. సాక్షిలో ఎడిటర్ గా సజ్జల వైసీపీ అనుకూలంగా ఎన్నో కథనాలు రాసేవారు.పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు దానికి మాత్రమే ఆయన పరిమితం కావాలని… కొన్నాళ్లపాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది అని జగన్ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. అలాగే తాడేపల్లి నివాసంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండకూడదు అని జగన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి వ్యవహారంతో కంగుతిన్న వైయస్ జగన్… మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రామకృష్ణారెడ్డిని దూరంగా పెడుతున్నట్లు సమాచారం.

Read also:వైసీపీ గూటికి కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం,
వైసీపీలో నుంచి బయటకు వెళ్లిపోయే నాయకులు తప్పించి ఆ పార్టీలోకి కొత్తగా వచ్చే నేతలే కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల కోసం ఆ పార్టీ వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని వీడిన నేతలు తిరిగి రీ ఎంట్రీకి ప్రయత్నిస్తుండటం జగన్‌కు ఊరటగా మారిందంటున్నారు గతంలో ఎప్పుడు చూడని విపత్కర పరిస్థితులను వైసీపీ చూస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ , 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది.అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించ లేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది.ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ క్యాడర్ డీలా పడిపోయింది. మరోవైపు పార్టీకి కీలక నేతలంతా కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలంతా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు.పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఇటీవలే పార్టీతో పాటు, తన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పార్టీ నుంచి వెళ్లే వారు తప్పిస్తే.. పార్టీలోకి వచ్చే నేతలెవ్వరూ కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత , తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు , తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి చేశారు.వైసీపీకి దూరమయ్యాక కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమాత్రం మెరుగు పడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు.మెట్టు గోవిందరెడ్డి బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.జగన్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more:Andhra Pradesh:బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్

Related posts

Leave a Comment